రామాయంపేట/ నిజాంపేట/ మనోహరాబాద్/ నర్సాపూర్/ వెల్దుర్తి/ కొల్చారం/ చిలిపిచెడ్, ఫిబ్రవరి 14 : ప్రజలు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెలెనెస్ కార్యక్రమాన్ని చేపట్టిందని డి.ధ ర్మారం ప్రభుత్వ దవాఖాన వైద్యురాలు హరిప్రియ, మున్సి పల్ చైర్మన్ పల్లె జితేందర్గౌడ్ అన్నారు. రామాయంపేట లోని సిద్దిపేట చౌరస్తాలో హెల్త్ అండ్ వెల్నెస్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం విద్యార్థులతో సైకిల్ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజలు నిత్యం వ్యా యామం చేయాలన్నారు. ముఖ్యంగా బీపీ, షుగర్ ఉన్నవారు ప్రతిరోజు నడకతోపాటు సైకిల్ తొక్కాలన్నారు. కార్యక్రమం లో మార్కెట్ కమిటీ చైర్మన్ యాదగిరి, పీఎసీఎస్ చైర్మన్ చం ద్రం, మున్సిపల్ కమిషనర్ ఉమాదేవి, పీహెచ్ఎన్ఎం సత్త మ్మ, సూపర్వైజర్ సునంద, కౌన్సిలర్లు గంగాధర్, అనిల్ కుమార్, సుందర్సింగ్, నాయకులు పాల్గొన్నారు.
నస్కల్లో ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్నెస్
నిజాంపేట మండలంలోని నస్కల్లో ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెలెనెస్లో భాగంగా ఎంపీపీ దేశెట్టి సిద్ధిరాములు సైకిల్ ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ ఆరోగ్యంగా ఉండాలంటే శారీరక వ్యాయామం తప్పనిసరి అన్నారు. సైకిల్ ప్రయాణంతో సంపూర్ణ ఆరోగ్యం పొందుతారని సూచించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సుధాకర్రెడ్డి పాల్గొన్నారు.
హెల్త్ ఆక్టివిటీపై సైకిల్ ర్యాలీ..
మనోహరాబాద్ మండల కేంద్రంలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై దృష్టి సారించాలని పీఏసీఎస్ చైర్మన్ మెట్టు బాలకృష్ణారెడ్డి, సర్పంచ్ మహిపాల్రెడ్డి సూచించారు. కార్యక్రమంలో పీహెచ్సీ వైద్యుడు ఆనంద్, ఎంపీవో లక్ష్మీనర్సింహ, పీఏసీఎస్ డైరెక్టర్ జావెద్పాషా, వార్డు సభ్యుడు లాయక్, కో ఆప్షన్ సభ్యుడు లావణ్యామల్లేశ్, రజక సంఘం అధ్యక్షుడు రవికుమార్ పాల్గొన్నారు.
ఆరోగ్యంపై శ్రద్ధ్ద వహించాలి : డిఫ్యూటీ డీఎంహెచ్వో
నర్సాపూర్ పట్టణంలో రెడ్డిపల్లి పీహెచ్సీ ఆధ్వర్యంలో హెల్త్మేళా నిర్వహించారు. దీనిలో భాగంగా సైకిల్ ర్యాలీ నిర్వహించి డయాబెటీస్, బీపీ ఉన్నవారికి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డిఫ్యూటీ డీఎంహెచ్వో విజయనిర్మల మాట్లాడుతూ.. డయాబెటీస్, బీపీ వ్యాధిగ్రస్తులు నిత్యం వ్యా యామం చేయాలని సూచించారు. కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ రఘువరుణ్, వైద్యురాలు మాధురి ఉన్నారు.
వ్యాయామంతో ఆరోగ్యరక్షణ : డాక్టర్లు శిరీష, సౌజన్య
వెల్దుర్తి మండలంలోని కుకునూర్లో పీహెచ్సీ సబ్సెంటర్ ఆధ్వర్యంలో ఆరోగ్యమేళా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు ఆరోగ్య రక్షణ కోసం చేయాల్సిన పనులు, తీసుకోవాల్సిన పౌష్టికాహారం, జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. వ్యాయామాలతో ఆరోగ్యానికి రక్షణ కల్పించవచ్చని వెల్దుర్తి ప్రభుత్వ దవాఖాన డాక్టర్లు శిరీష, సౌజన్య అన్నారు.
క్యాన్సర్, డీ వార్మింగ్పై అవగాహన ర్యాలీ
కొల్చారం మండలకేంద్రంలో వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ నిర్వహించి, ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కొల్చారం మెడికల్ ఆఫీసర్ రమేశ్ మాట్లాడుతూ.. మగవారిలో ఓరల్ క్యాన్సర్, మహిళల్లో సర్వైకల్ క్యాన్సర్ వస్తుందన్నారు. తొలి దశలోనే దీన్ని గుర్తిస్తే చికిత్సతో తగ్గుతుందన్నారు. 2 నుంచి 19 ఏండ్ల ప్లిలలకు ప్రతి ఆరు నెలలకు డీవార్మింగ్ చేయించాలన్నారు. కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ శైలేందర్, ఎంపీ డీవో గణేశ్రెడ్డి, ఇన్చార్జి కార్యదర్శి నగేశ్, మెదక్ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ రాజాగౌడ్, కారోబార్ ప్రభాకర్ ఉన్నారు.
యోగా చేయాలి : ఎంఎల్హెచ్ స్వప్న
చిలిపిచెడ్ మండలంలోని చిట్కుల్, ఫైజాబాద్ గ్రామాల్లో ఆరోగ్యమేళాలో భాగంగా సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఆయా గ్రామాల్లో 30 సంవత్సరాలు పైబడిన వారికి బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించారు. ప్రజలు ప్రతిరోజూ యోగా చేయాలని ఎంఎల్హెచ్ స్వప్న, ఏఎన్ఎం పెంటమ్మ సూచించారు.
ప్రతిరోజూ నడక తప్పనిసరి : ఎంపీపీ శ్రీనివాస్
పెద్దశంకరంపేటలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ప్రజలు రోజూ వ్యాయామం చేయాలని ఎంపీపీ శ్రీనివాస్ సూచించా రు. కార్యక్రమంలో వైద్యాధికారి వికాస్, సర్పంచ్లు రాము లు, ప్రకాశ్, వైద్యసిబ్బంది సాయిలు, వెంకటేశం ఉన్నారు.