సర్కారు దవాఖానల్లో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నది. ప్రైవేటుకు దీటుగా వసతులు కల్పిస్తూ పేదలకు అన్ని చికిత్సలు ఉచితంగా చేస్తున్నది. ఇందులోభాగంగా అన్ని పీహెచ్సీల్లో టీ డయాగ్నోస్టిక్ సెంటర్లు ఏర్పాటు చేసి ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నది. ఇప్పటి వరకు 57 రకాల టెస్ట్లు చేస్తుండగా, ఇక నుంచి ఆ సంఖ్యను ప్రభుత్వం 134కు పెంచింది. శనివారం వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు హైదరాబాద్ నుంచి వర్చువల్గా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ వైద్యంపై ప్రజలకు మరింత నమ్మకం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. స్థానికంగానే ప్రతి పీహెచ్సీలో టెస్ట్లు చేయించుకోవచ్చని, 24 గంటల్లోనే రిపోర్టు వస్తుందన్నారు. మెదక్ జిల్లా దవాఖానలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, సంగారెడ్డిలో టీఎస్హెచ్డీసీ చైర్మన్ చింతా ప్రభాకర్ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి సౌకర్యం లేదని, పేదలు ఇబ్బందులు పడొద్దనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ టీ డయాగ్నోస్టిక్ హబ్ల్లో ఉచితంగా పరీక్షలు చేయించుకునే అవకాశం కల్పించారన్నారు. మెదక్కు త్వరలోనే మెడికల్ కళాశాల మంజూరవుతుందని, వచ్చే విద్యా సంవత్సరం నుంచి సీట్లు కేటాయిస్తామన్నారు.
– మెదక్ (నమస్తే తెలంగాణ)/ సంగారెడ్డి అర్బన్, జూలై 1
మెదక్, జులై 1 (నమస్తే తెలంగాణ)/సంగారెడ్డి అర్బన్, జూలై 1: పేదల ఆరోగ్యానికి మరింత భరోసా లభించనున్నదని, ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తున్నదని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు తెలిపారు. వర్చువల్గా 134 రకాల ఉచిత పరీక్షలకు డయాగ్నోస్టిక్ హబ్ను శనివారం ప్రారంభించారు. మెదక్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖాన సమీపంలో ఏర్పాటు చేసిన టీఎస్ డయాగ్నోస్టిక్ హబ్లో 134 రకాల పరీక్షలను మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా 134 పరీక్షలకు సంబంధించిన చార్ట్ను ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. పేదలు ప్రైవేట్ దవాఖానలకు వెళ్లి డబ్బులు ఖర్చు పెట్టుకోవద్దనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా పరీక్షలు చేస్తున్నదన్నారు. జిల్లాలోని అన్ని పీహెచ్సీలలో రోగుల నుంచి శాంపిల్స్ సేకరించి జిల్లా కేంద్ర ఆస్పత్రిలో డయాగ్నోస్టిక్ హబ్కు వాహనాల ద్వారా తీసుకురావడం జరుగుతుందన్నారు. తెలంగాణ డయాగ్నోస్టిక్ హబ్లోనే పరీక్షలు నిర్వహిస్తారని, ఆ తర్వాత రోగుల ఫోన్లకు సమాచారం వస్తుందన్నారు. పేదలు ఇబ్బందులు పడకుండా ఉండడానికే సీఎం కేసీఆర్ డయాగ్నోస్టిక్ హబ్లో ఉచితంగా అన్ని రకాల పరీక్షలు చేయడం జరుగుతుందన్నారు. ప్రైవేట్ దవాఖానలకు వెళ్లి వేల రూపాయలు ఖర్చు చేసుకుంటున్నారని, ఇలాంటి ఇబ్బందులు ఉండకూడదనే ఉద్ధేశంతో రోగుల సమస్యలకు సంబంధించి అన్ని పీహెచ్సీ కేంద్రాలల్లో శాంపిల్స్ సేకరిస్తారన్నారు. ముఖ్యంగా మహిళలకు సంబంధించిన ఆరోగ్య సమస్యల పరీక్షలను చేసుకోవచ్చని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ కార్యక్రమం లేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లా కేంద్రంలోని డయాగ్నోస్టిక్ హబ్లో 134 పరీక్షలు ఉచితంగా చేస్తారన్నారు.
త్వరలో మెదక్కు మెడికల్ కళాశాల
త్వరలో మెదక్కు మెడికల్ కళాశాల మంజూరు చేయనున్నట్లు మంత్రి హరీశ్రావు హామీ ఇచ్చారని ఎమ్మెల్యే తెలిపారు. మెదక్లో మెడికల్ కళాశాలకు సంబంధించిన స్థలాన్ని కూడా ఎంపిక చేశామన్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో మెడికల్ కళాశాలలో సీట్లు కూడా కేటాయించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్కు, మంత్రి హరీశ్రావుకు ధన్యవాదాలు తెలిపారు. మెదక్కు సీఎం కేసీఆర్ రానున్న సందర్భంగా మెడికల్ కళాశాలకు శంకుస్థాపన చేయనున్నామన్నారు. మరో 100 పడకల దవాఖానను సీఎం కేసీఆర్ మంజూరు చేయనున్నారన్నారు. దీంతో జిల్లా కేంద్రంలో 350 పడకల దవాఖానగా రూపుదిద్దుకుంటుందని తెలిపారు. వైద్యుల దినోత్సవం సందర్భంగా డాక్టర్లందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, జడ్పీ వైస్ చైర్ పర్సన్ లావణ్యారెడ్డి, డీఎంహెచ్వో డాక్టర్ చందునాయక్, జిల్లా కేంద్ర దవాఖాన సూపరింటెండెంట్ పి.చంద్రశేఖర్, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, మాజీ వైస్ చైర్మన్ రాగి అశోక్, కౌన్సిలర్ రాగి వనజ, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గంగాధర్, లింగారెడ్డి, కో ఆప్షన్ సభ్యుడు ఉమర్, కౌన్సిలర్లు వంజరి జయరాజ్, కిశోర్, ఆర్కే శ్రీనివాస్, ప్రభురెడ్డి, నాయకుడు బానీ, డాక్టర్లు చంద్రశేఖర్, కిరణ్, హబ్ మేనేజర్ ప్రజ్ఞా, ల్యాబ్ టెక్నీషియన్లు తదితరులు పాల్గొన్నారు.
సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ దవాఖానలో..
ప్రభుత్వ దవాఖానలకు బలోపేతం చేసి, పేదలకు మెరుగైన సేవలు అందించేందుకు తెలంగాణ సర్కారు వైద్య శాఖలో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ దవాఖానలో టీ డయాగ్నోస్టిక్ సెంటర్ హబ్ను మంత్రి వర్చువల్గా శనివారం ప్రారంభించారు. ఈ ల్యాబ్ను టీఎస్ హెచ్డీసీ చైర్మన్ చింతా ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ దవాఖానల్లో ఇది వరకు 57 రకాల పరీక్షలు చేసేవారని, ఇప్పుడు 134 రకాల పరీక్షలను ఉచితంగా చేస్తారని తెలిపారు. 2018 నుంచి పాథాలజా రక్త మూత్ర పరీక్షలతో పాటు ఎక్స్రే, యూసీజీ, ఈసీజీ, టుడీఏకో, రేడియాలజీ వంటి పరీక్షలు అందుబాటులోకి వచ్చాయన్నారు. ఇప్పటివరకు ప్రభుత్వ దవాఖానల్లో 10 కోట్ల పరీక్షలు చేసినట్లు తెలిపారు. 134 రకాల టెస్టులు ప్రతి పీహెచ్సీ సెంటర్ నుంచి జిల్లా దవాఖాన వరకు చేయనున్నారన్నారు. ప్రజలు గమనించి జిల్లా దవాఖానలకు నేరుగా రాకుండా పీహెచ్సీ సెంటర్లలోనూ పరీక్షలు చేసుకోవచ్చాన్నారు. 24 గంటల్లో రోగి రిపోర్టును మెసేజ్ ద్వారా వారి సెల్ ఫోన్లకు అందిస్తారన్నారు. అధికారులు పేదలకు మరింత సేవలందించేందుకు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ విజయలక్ష్మి, మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రభుగౌడ్, సీడీసీ చైర్మన్ బుచ్చిరెడ్డి, కౌన్సిలర్లు, ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వాణి, సూపరింటెండెంట్ డాక్టర్ అనిల్కుమార్, ఆర్ఎంవో డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
వైద్య రంగంలో మహాద్భుతం
ప్రభుత్వ దవాఖానల్లో 134 రకాల పరీక్షలు ప్రారంభించడం మహాద్భు తం. గతంలో ప్రభు త్వ దవాఖానల తీరు చాలా ధీనంగా ఉండే ది. నా 30 ఏండ్ల సర్వీసులో ప్రభుత్వ దవాఖానలో ఇలాం టి మెరుగైన వసతులు చూడడం ఊహించలేని నిజం. అదీ బడుగు, బలహీన వర్గాల కోసం ఉచితంగా అందించడం గర్వించదగ్గ విషయం.
– డాక్టర్ వాణి, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్, సంగారెడ్డి
ఇదొక గొప్ప వరం
తెలంగాణలోని ప్రభుత్వ దవాఖాన ల్లో 134 రకాల వ్యా ధులకు ఉచితంగా పరీక్షలు నిర్వహించ డం పేదలకు ఒక గొప్ప వరం. నాకు గుండె జబ్బు ఉన్నదని ప్రైవేట్ దవాఖానకు వెళ్తే లక్షల్లో డబ్బు కావాలని చెప్పారు. దీంతో ఎలాంటి పరీక్షలు చేయించుకోకుండా అనారోగ్య బారిన పడ్డాను. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన టీ డయాగ్నిక్ సెంటర్లో నాకు వైద్యం అందుతున్నది.
– లక్ష్మి, మెదక్
ప్రైవేటుకు దీటుగా సేవలు
ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ఒకప్పుడు దీర్ఘకాలిక వ్యాధి బారినపడితే హైదరాబాద్కు వెళ్లి ప్రైవేటు దవాఖానలో చూయించుకునేవాళ్లం. నేడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన వైద్యం అందిస్తున్నారు.
– మల్లేశం, పిట్లం