సంగారెడ్డి, మే24: సంగారెడ్డి జిల్లా కేంద్ర ప్రభుత్వ దవాఖానలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకం చేయాలని హెచ్డీసీ చైర్మన్ చింతా ప్రభాకర్ మంత్రి హరీశ్రావును కోరారు. దీంతో స్పందించి నియమించినందుకు ఆయన హర్ష్యం వ్యక్తం చేశారు.
బుధవారం హైదరాబాద్లో మంత్రి హరీశ్రావును చింత ప్రభాకర్ కలిసి జిల్లా కేంద్రంలోని దవాఖానలో 37 మంది అసిస్టెంట్ ప్రొపెసర్ల నియామకం చేపట్టి, సిబ్బంది కొరతను పరిష్కరించారని తెలిపారు. సీఎం కేసీఆర్, ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావుకు ధన్యవాదాలు తెలిపారు.