సిద్దిపేట, జూలై 31: సకల వసతులు, ఆధునిక హంగులు, గెటెడ్ కమ్యూనిటీ తరహాలో పట్టణంలోని నిరుపేదల కోసం ప్రభుత్వం నిర్మించి ఇచ్చిన డబుల్ బెడ్రూం ఇండ్ల కాలనీ కేసీఆర్నగర్లో రూ. 8 కోట్లతో 33/11కేవీ సబ్ స్టేషన్ మంజూరైనట్లు ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సుమారు 2500 కుటుంబాలు నివాసం ఉండే కాలనీలో ఇంటింటికీ ఉచితంగా పైప్లైన్ ద్వారా గ్యాస్ కనెక్షన్, తాగునీరు సరఫరా, కమ్యూనిటీ హాల్, బడి, గుడి, మార్కెట్ నిర్మాణాలు, పోలీస్ అవుట్ పోస్ట్, బస్తీ దవాఖాన, పార్కు, లైబ్రరీ సకల సౌకర్యాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు.
నిరుపేదలకు ఎలాంటి ఇబ్బందులు కలుగవద్దని, ప్రతి ఇంటికీ కరెంట్ మీటరు పెట్టించి నివాస ధ్రువీకరణ పత్రాలు ఇచ్చి సీఎం కేసీఆర్ చేతుల మీదుగా గృహప్రవేశాలు చేయించామన్నారు. నిరంతరం నాణ్యమైన కరెంట్ ప్రజలకు అందించాలనే రూ.8కోట్లతో 33/11కేవీ సబ్స్టేషన్ నిర్మిస్తున్నట్లు మంత్రి తెలిపారు. త్వరలో సబ్స్టేషన్ నిర్మాణ పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. దీంతో కేసీఆర్నగర్తోపాటు మరిన్ని ప్రాంతాలకు మేలు జరుగుతున్నదన్నారు. రానున్న రోజుల్లో మరో 1000 ఇండ్లు నిర్మా ణం కానున్నాయని, భవిష్యత్లో కేసీఆర్నగర్ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని సబ్స్టేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.