సిద్దిపేట టౌన్, డిసెంబర్ 24 : ప్రేమాభావం, సేవాతత్పరతను క్షమా గుణాన్ని బోధించిన క్రీస్తు జన్మదినమై క్రిస్మస్ పండుగను క్రైస్తవులు సంతోషంగా జరుపుకోవాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు ఆకాంక్షించారు. ఉమ్మడి జిల్లా ప్రజలు, క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు.
క్రీస్తు జన్మదినం క్రైస్తవులకు అత్యంత సంతోషకరమైన రోజు అన్నారు. క్రిస్మస్ పండుగ వేళ అందరికీ శుభం కలగాలని ఏసు ప్రభును ప్రత్యేకంగా ప్రార్థించారు. క్రీస్తు దీవెనలు అందరికీ చేకురాలని.. ప్రతిఒక్కరూ ఆనందంగా జీవించాలని ఆ ప్రభువును వేడుకున్నారు.