మెదక్ రూరల్ అక్టోబర్ 23 : దళారుల చేతిలో మోసపోకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు విక్రయించాలని మెదక్ పిఎసిఎస్ చైర్మన్ చిలుముల హనుమంత్ రెడ్డి అన్నారు. గురువారం మెదక్ మండల పరిధిలోని పేరూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని చైర్మన్ హనుమంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించేటప్పుడు నాణ్యత ప్రమాణాలను పాటించాలని అన్నారు.
ప్రభుత్వం వరి ధాన్యానికి ఏ గ్రేడ్ ధర 2,389, బి గ్రేడ్ ధర 2,369 కేటాయించడం జరిగిందని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. దళారులను నమ్మి రైతులు మోస పోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు సెంటర్ లోనే ధాన్యాన్ని విక్రయించాలని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసరెడ్డి, అనిల్, శెకయ్య,బీరయ్య,,కుమార్ విఠల్ ,యేసు,యాదగిరి, కిరణ్,నాయకులు తదితరులు ఉన్నారు.