మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి
మెదక్, జూన్ 12 (నమస్తే తెలంగాణ): ప్రతి ముస్లిం తన జీవితకాలంలో ఒక్కసారైనా హజ్ యాత్ర చేయాలని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని షాదీఖానాలో హజ్ యాత్రకు వెళ్లే వారికి తర్పీయతి కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా 18 మంది ముస్లింలు హజ్ యాత్రకు వెళ్తున్నారన్నారు. యాత్రికులకు ముందస్తుగా హజ్ తర్పీయతి నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు.
హజ్ యాత్రికులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్సీ ఫారూక్హుస్సేన్ హజ్ యాత్ర గొప్పతనాన్ని వివరించారు. యాత్రలో తీసుకోవాల్సిన నియమ నిబంధనలు, క్రమ శిక్షణతో చేయాల్సిన ప్రార్థనల గురించి వివరించారు. అనంతరం యాత్రికులను ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా హజ్ సొసైటీ సభ్యులు మహ్మద్ అజాజుద్దీన్, మహ్మద్ నయీముద్దీన్, సాబేర్ పాషా, ఖాజాక్వైజ్ మొజిజొద్దీన్, జడ్పీ వైస్ చైర్మన్ లావణ్యారెడ్డి, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్గౌడ్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గంగాధర్, ప్రధాన కార్యదర్శి గడ్డమీది కృష్ణాగౌడ్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రాగి అశోక్, కౌన్సిలర్లు సమీయొద్దీన్, జయరాజ్, లక్ష్మీనారాయణగౌడ్ పాల్గొన్నారు.