పటాన్చెరు, అక్టోబర్ 20: అభివృద్ధిని చూసి ఆశీర్వదించాలని పటాన్చెరు ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. శుక్రవారం పటాన్చెరు పట్టణంలో వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఆయన కుటుంబ సభ్యులతో కలిసి పూజలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పట్టణంలోని పలు కాలనీల్లో ఇంటింటికీ తిరుగుతూ కారు గుర్తుకు ఓటేయ్యాలని ఓటర్లను కోరారు. పటాన్చెరు పట్టణం పదేండ్ల క్రితం ఎలా ఉంది.? ఇప్పుడెలా ఉంది అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు పటాన్చెరు పట్టణం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని కొనియాడారు. అభివృద్ధిలో పటాన్చెరు టాప్లో ఉందని పేర్కొన్నారు. మళ్లీ ఎమ్మెల్యేగా మీరు భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా మహిపాల్రెడ్డి మాట్లాడుతూ ప్రజల ఆశీస్సులతో తప్పకుండా గెలుస్తానన్నారు. మీకు సేవ చేసేందుకు మరో అవకాశం ఇవ్వాలని కోరారు. పటాన్చెరు పట్టణంలో వందల కోట్లతో అభివృద్ధి పనులు చేశామన్నారు.
2014 వరకు పటాన్చెరు పట్టణం అధ్వానమైన మౌలిక వసతులతో కనిపించేందన్నారు. ఇప్పుడు పటాన్చెరు అభివృద్ధిలో నగరానికి దీటుగా ముం దున్నదన్నారు. పదేండ్ల తరువాత వచ్చి న వారు పటాన్చెరు అభివృద్ధిని చూసి పోల్చుకోలేకపోతున్నారన్నారు. కాలు ష్య జలాల స్థానంలో సురక్షితమైన మిషన్ భగీరథ నీటిని ఇస్తున్నామన్నా రు. ప్రతి కాలనీకి సీసీ రోడ్లు వేశామన్నారు. అండర్గ్రౌండ్ డ్రైనేజీలు నిర్మించామన్నారు. 24గంటలు కరెంట్ ఇస్తున్నామన్నారు. రాత్రివేళ స్ట్రీట్ లైట్లు వెలుగులు ఇస్తున్నాయన్నారు. పార్క్ లు ఏర్పాటు చేశామన్నారు. కమ్యూనిటీ హాల్స్ను నిర్మించామన్నారు. కేజీ టు పీజీ వరకు పటాన్చెరులో ఉచితంగా చదవచ్చన్నారు. కంపెనీల రాక తో ఉద్యోగాలు వస్తున్నాయన్నారు. కా ర్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్కుమార్, పార్టీ పట్టణాధ్యక్షుడు అఫ్జల్, సీనియర్ నా యకులు గూడెం మధుసూదన్రెడ్డి, గూడెం కల్పనామధుసూదన్రెడ్డి, కం కర శ్రీను, వెంకటేశ్, గుండమల్ల రాజు, నవీన్రెడ్డి, మంగలి వినో ద్, మాధవి, కొండల్, ధనరాజ్గౌడ్, శ్యామ్, అరుంధతి తదితరులున్నారు.