అభివృద్ధి చేశాం.. మరోసారి ఆశీర్వదించాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీర్ హరీశ్రావు అన్నారు. శనివారం జహీరాబాద్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రారంభించి ఆయన మాట్లాడారు. జహీరాబాద్లో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. అర్హులందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తున్నామని, జాగ ఉన్న వారికి గృహలక్ష్మి కింద ప్రభుత్వ ఆర్థికసాయం అందజేస్తున్నామన్నారు. కాంగ్రెస్ హయాంలో జహీరాబాద్ ఎట్లుండె&ఇప్పుడు ఎట్లుందో ఒక్కసారి ఆలోచించాలని ప్రజలను కోరారు. నియోజకవర్గంలో విద్య, వైద్యం, రోడ్లకు ఎంతో ప్రాధాన్యమించ్చామని చెప్పారు. ఈ ప్రాంతానికి త్వరలో కాళేశ్వరం నీళ్లు తీసుకొస్తామన్నారు. గిరిజనులకు పోడు పట్టాలివ్వడంతో పాటు గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ కల్పించామన్నారు. కాంగ్రెస్,బీజేపీ మాటలు నమ్మి ఆగం కావొద్దన్నారు. కాంగ్రెస్ సెక్యులర్ పేరుతో ముస్ల్లిం ఓట్లు దండుకుని అభివృద్ధిని విస్మరించిందన్నారు. మన రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పాలనను పక్కనున్న కర్ణాటకలో కాంగ్రెస్ ఎందుకు అమలు చేయడం లేదన్నారు. స్థానిక నాయకుడైన ఎమ్మెల్యే మాణిక్రావును మరోసారి ఆశీర్వదించి, మరింత అభివృద్ధి చేసుకోవాలని ప్రజలను కోరారు.
– జహీరాబాద్, అక్టోబర్ 7
జహీరాబాద్, అక్టోబర్ 7: కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రంలో అమలుచేయని సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలు చేస్తామని హామీ ఇచ్చి ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నదని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీర్ హరీశ్రావు అన్నారు. శనివారం జహీరాబాద్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రారంభించి మంత్రి హరీశ్రావు ప్రసంగించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డ రాష్ట్రంలో పార్టీని గెలుపించుకోలేన్నారు. తెలంగాణలో హంగు వస్తుందని మాట్లాడుతుండడం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్, బీజేపీలకు తెలంగాణలో ఓటమి తప్పదన్నారు. బీఆర్ఎస్ పార్టీ శాసనసభ ఎన్నికల్లో హ్యాట్రిక్ సాధించి మూడోసారి కేసీఆర్ సీఎం కావడం ఖాయమన్నారు. బీజేపీ గత ఎన్నికల్లో ఒక శాసనసభ స్థానంలో గెలుపొందిందన్నారు. ఈ సారి ఆ ఒక్క సీటు కూడా గెలువలేరన్నారు. కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా రాదని మంత్రి చెప్పారు. జహీరాబాద్కు పక్కనున్న కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎందుకు రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను అమలు చేయడం లేదన్నారు. కర్ణాటకలో అమలు చేయని పథకాలు తెలంగాణలో అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసే కుట్ర చేస్తుందన్నారు.
సీఎం కేసీఆర్ హయాంలో తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి సాధించిందన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీ ఇవ్వని అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేశామన్నారు. తెలంగాణలో ముస్లిం మైనార్టీ విద్యార్థులు చదువుకొనేందుకు గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేశామన్నారు. కర్టాటక, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో రాత్రి పడుకొనే పరిస్థితి లేదన్నారు. కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ పేరుతో ముస్లిం ఓట్లు వేయించుకొని అభివృద్ధి చేయలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ముస్లి్ంలలు డ్రైవర్లుగా, ఆటో డ్రైవర్లు పనిచేశారని, తెలంగాణ ప్రభుత్వ హయాంలో డాక్టర్లు, ఇంజినీరింగ్ చదువుకుంటున్నారన్నారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. బీజేపీ గెలువది, కాంగ్రెస్ లేవదు అన్నారు. ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు సరఫరా చేస్తున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా తాగునీరు సరఫరా చేయలేదన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల కాంగ్రెస్, బీజేపీ పార్టీల నాయకులకు అందజేస్తున్నామని మంత్రి చెప్పారు. కర్ణాటకలో పింఛన్ రూ. 600 ఉంటే తెలంగాణలో రూ. 2000 ఉందన్నారు. అక్కడ ఎందుకు పింఛన్ ఎక్కువ ఇవ్వడం లేదన్నారు.
జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు లోకల్ వ్యక్తి, కాంగ్రెస్ పార్టీకి చెందిన పొరుగు వ్యక్తులు వస్తున్నారు జాగ్రత్తగా ఆలోచన చేయాలని మంత్రి ప్రజలను కోరారు. మాణిక్రావు పేద కుటుంబానికి చెందిన వ్యక్తి, స్థానికంగా ఉండి ప్రజా సమస్యలను పరిష్కరించే నాయడుడు మరోసారి ఎన్నికల్లో మాణిక్రావును ఆశీర్వదించించాలని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకులు అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి మోసం చేస్తారు జాగ్రత్త అన్నారు. పొరుగు వ్యక్తులతో జాగ్రత్తగా ఉండి ఎన్నికల్లో బీఆర్ఎస్ను భారీ మెజార్టీతో గెలుపించాన్నారు. జహీరాబాద్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉంటే పనులు జరుగుతాయి. ఇతరులు ఎమ్యెల్యే ఉంటే అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు కావని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి 30 స్థానాల్లో అభ్యర్థులు లేరన్నారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ 88 స్థానాల్లో గెలుపొందిందని, ఈ సారి 100 స్థానల్లో విజయం సాధించి, హ్యట్రిక్ సాధిస్తుందన్నారు. పక్క ఇంటివాడు మనోడు కాడు, జాగ్రత్తగా ఆలోచన చేసి ఓట్లు వేయాలన్నారు.
రాష్ట్రంలో గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు కలిపించిన ఘనత సీఎం కేసీఆర్దేనని మంత్రి హరీశ్రావు అన్నారు. గిరిజన తండాలను గ్రామ పంచాయతీలు చేశామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ 2009లో జరిగిన ఎన్నికల్లో గిరిజన తండాలను గ్రామ పంచాయతీలు చేస్తామని హామీ ఇచ్చిన అమలు చేయలేదన్నారు. మొగుడంపల్లి మండలంలోని ఉప్పర్పల్లి తండాల్లో ఉన్న మోతిమాత జాతరకు రూ. కోటి నిధులు మంజూరు చేసి ఘనంగా ఉత్సవాలు జరిపించమన్నారు. కాంగ్రెస్ పార్టీ గిరిజనుల సంక్షేమన్ని ఎప్పుడూ పట్టించుకోలేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గిరిజనులను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. గిరిజనుల కలలను బీఆర్ఎస్ ప్రభుత్వం నిజం చేసిందన్నారు.
జహీరాబాద్ పట్టణంలో రెడ్డి సంఘం భవన నిర్మాణం కోసం స్థలం ఇచ్చి రూ. 80 లక్షలు మంజూరు చేశామని మంత్రి చెప్పారు. పట్టణంలో ఉన్న విశ్రాంతి ఉద్యోగులకు భవనం నిర్మాణం కోసం స్థలం, నిధులు మంజూరు చేశామన్నారు. వీడియో, ఫొటోగ్రాఫర్ల సంఘానికి భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేశామన్నారు. ముదిరాజ్, యాదవ్ల కుల సంఘాలకు సామూహిక భవనాలు మంజూరు చేసి, స్థలంతో పాటు నిధులు మంజూరు చేశామన్నారు. ముస్ల్లిం, క్రైస్తవులకు శ్మశాన వాటికలకు భూమి ఇచ్చామన్నారు.
జహీరాబాద్ పట్టణంలో రూ.175 కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభించమని మంత్రి హరీశ్రావు చెప్పారు. 3వేల గృహలక్ష్మి ఇండ్లకు నిధులు మంజూరు చేసి మంజూరు పత్రలు అందజేశామన్నారు. హోతి(కే) శివారులో 666 ఇండ్లు నిర్మాణం చేసి లబ్ధిదారులకు అందజేశామన్నారు. ఎస్హెచ్జీ సంఘాలకు రూ. 204 కోట్లు చెక్కులు పంపిణీ చేశామన్నారు. క్రీడాకారులకు క్రీడాకిట్లు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. ముస్లింలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కట్టు మిషన్లు అందజేశామన్నారు.
జహీరాబాద్ నియోజకవర్గంలో ప్రతి ఎకరానికి కాళేశ్వరం నీటిని అందిస్తామని మంత్రి చెప్పారు. ఒక్కటి, రెండేండ్లలో వ్యవసాయానికి సాగు నీరు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. మంజీరా నదిపై సింగూర్ ప్రాజెక్టు వద్ద పనులు జరుగుతున్నాయని చెప్పారు. వ్యవసాయాన్ని పండుగ చేసేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. తొమ్మిడేండ్లలో వ్యవసాయం ఎంతో అభివృద్ధి సాధించిందన్నారు.
జహీరాబాద్ పట్టణంలోని సర్కార్ దవాఖానలో కార్పొరేట్ తరహాలో వైద్యసేవలు అందిస్తున్నాం. మాతా, శిశు దవాఖాన నిర్మాణం కోసం రూ.12 కోట్లు మంజూరు చేశామని మంత్రి చెప్పారు. గతంలో జహీరాబాద్ ఎమ్మెల్యేగా డాక్టర్ గీతారెడ్డి ఉన్నా సర్కార్ దవాఖానను పట్టించుకోలేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం సర్కారు దవాఖానలో మెరుగైన సౌకర్యలు కలిపించిందన్నారు. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సీఎం కేసీఆర్ జిల్లాకో వైద్య కళాశాలలు ఏర్పాటు చేశారన్నారు. సమావేశంలో జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే మాణిక్రావు, సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్, రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, నియోజకవర్గ సమన్వయ కర్త దేవీప్రసాద్రావు, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నరోత్తం, రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి సంస్థ చైర్మన్ తన్వీర్, ఉమ్మడి జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ ఎం. శివకుమార్, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ భిక్షపతి, జడ్పీ చైర్మన్ మంజుశ్రీ, ఆర్డీవో వెంకారెడ్డి, వివిధ శాఖల అధికారులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.