సంగారెడ్డి, జూన్ 27 : ప్రజల అభివృద్ధి, సంక్షేమానికి ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేసి, ప్రభుత్వ లక్ష్యాలను సాధించాలని సంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్రెడ్డి పిలుపునిచ్చారు. ఇంటింటికీ ప్రభుత్వ పథకాలను వివరించాలన్నారు. జిల్లా పరిషత్ కార్యాలయం లో జడ్పీ చైర్పర్సన్ అధ్యక్షతన మంగళవారం స్థాయీ సం ఘాల సమావేశాలను జడ్పీసీఈవో ప్రారంభించారు. ఉద యం 10 గంటలకు 2వ స్థాయీ సంఘం గ్రామీణాభివృద్ధ్ది, 12 గంటలకు విద్య, ఆరోగ్యం, మధ్యాహ్నం 2:30 గంటల కు ఆర్థిక ప్రణాళికలు, 3:30 గంటలకు అభివృద్ధి పనులపై సమావేశాలను నిర్వహించారు. సమావేశాలకు అధికారులు గైర్హాజరు కావడంపై జడ్పీ చైర్పర్సన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్రెడ్డి మాట్లాడుతూ.. స్థాయీ సంఘాల సమావేశాలకు అధికారులు రాకుంటే ఎలా? అని ప్రశ్నించారు. ఇలా అయితే.. ప్రభుత్వ పథకాలు ప్రజలకు ఎలా? తెలుస్తాయన్నారు. సీఎం కేసీఆర్ గృహలక్ష్మి పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించిన విషయా న్ని గుర్తించారు. గ్రామీణ, పట్టణ ప్రాంత ప్రజలకు సొంత స్థ లం ఉన్నవారు ఇంటి నిర్మాణానికి గృహలక్ష్మి పథకంలో రూ. 3 లక్షల ఆర్థికసాయం ప్రభుత్వం ఇస్తుందన్నారు. దీనిపై ప్రజ లకు అవగాహన కల్పించాలని ప్రజాప్రతినిధులు, అధికారు లకు సూచించారు. సమస్యలు చర్చించి, తీర్మానాలు చేయా ల్సిన అధికారులు సమావేశాలకు హాజరుకాకపోవడం ఎలా? అని ప్రశ్నించారు. దశాబ్ది ఉత్సవాలతో ప్రభుత్వశాఖలపై ప్రజలకు అవగాహన వచ్చిందని, ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు.
సోలార్ విద్యుత్పై అవగాహన కల్పించాలి
సోలార్ విద్యుత్ ఉత్పత్తితోపాటు వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పిస్తే సత్ఫాలితాలు వస్తాయని జడ్పీ చైర్పర్సన్ అన్నారు. జిల్లా పరిషత్ భవనంపై సోలార్ యూనిట్ ఏర్పా టు చేయాలని ఇంధనశాఖ అధికారులను కోరారు. మేజర్ గ్రామపంచాయతీల్లో సోలార్ విద్యుత్ వినియోగాన్ని అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జాతీయ రహదారులపై చార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేస్తే సోలార్పై వాహనదారులకు అవగాహన వస్తుందన్నారు. కాలుష్య కారక పరిశ్రమల్లో తనిఖీ చేయాలని, ప్రభుత్వ అనుమతులను రెన్యువల్ చేసుకోకుంటే నోటీసులు జారీ చేసి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశాల్లో జడ్పీటీసీలు కుమార్గౌడ్, రాఘవారెడ్డి, అరుణరెడ్డి, సుప్రజ, రమేశ్, మీనాక్షి, కొండల్రెడ్డి, ఆంజనేయులు, సునీత, మల్లికార్జున్పాటిల్, నర్సింహ రెడ్డి, డిప్యూటీ సీఈవో స్వప్న, అధికారులు పాల్గొన్నారు.