గజ్వేల్, ఆగసు ్ట6 : ప్రభుత్వ బడులతో విద్యార్థులకు బంగారు భవిష్యత్ కలుగుతుందని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు. శనివారం అహ్మదీపూర్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రొఫెసర్ జయశంకర్సార్ జయంతిని పురస్కరించుకుని గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ సహకారంతో పాఠశాలలో ఏర్పాటు చేసిన బాలికలకు విశ్రాంతి గది, స్పోర్ట్స్క్లబ్, లైబ్రరీని కలెక్టర్ ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పేద విద్యార్థుల కోసం ప్రభుత్వ పాఠశాలల్లో అనేక సదుపాయాలు కల్పిస్తున్నట్లు చెప్పారు.
అహ్మదీపూర్ పాఠశాలలో బాలికల విశ్రాంతి గది, లైబ్రరీని ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. పాఠశాలను చాలా బాగా తీర్చిదిద్దారంటూ ప్రధానోపాధ్యాయుడు, సహకరించిన ఏఎంసీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ను అభినందించారు. పాఠశాలల్లో బాలికలకు విశ్రాంతిగది దేశంలో ఎక్కడా లేదని, ఇక్కడ ఏర్పా టు చేయడం అభినందనీయమన్నారు. పిల్లలకు చదువుతోపాటు క్రీడలు చాలా అవసరమన్నారు. జీవితంలో సక్సెస్ కావాలంటే ఏకాగ్రతతో చదవాలన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ స్ఫూర్తితో విద్యార్థులు ముందుకువెళ్లాలన్నారు. సిద్దిపేట జిల్లాలో పెద్దపెద్ద పరిశ్రమలు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నా రు. ఇప్పటికే వర్గల్, బండమైలారం ప్రాం తాల్లో పరిశ్రమలు నెలకొల్పుతున్నారన్నారు. ప్రైవేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ‘మనఊరు-మనబడి’ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. ఇక్కడి విద్యార్థులు చాలా అదృష్టవంతులన్నారు.
గజ్వేల్లో ఎడ్యుకేషన్ హబ్, హార్టికల్చర్ యూనివర్సిటీ, ఫారెస్ట్ కళాశాల, అగ్రికల్చర్ కళాశాలలు ఉన్నాయన్నారు. అనంతరం ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి మాట్లాడుతూ జయశంకర్ మలిదశ ఉద్యమంలో సీఎం కేసీఆర్కు అండగా ఉన్నారన్నారు. ఎమ్మెల్సీ యాదవరెడ్డి మాట్లాడుతూ జయశంకర్ తెలంగాణ సాధనలో సలహాదారుగా సీఎం కేసీఆర్ మార్గ్గనిర్దేశం చేశారన్నా రు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు కరీమొద్దీన్, గజ్వేల్ ఎంఈవో సునీత, ‘గడా’ ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డి, ఏఎంసీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, జడ్పీటీసీ పంగమల్లేశం, ఎంపీపీ అమరావతి, సర్పంచ్ లావణ్య, ఎం పీటీసీ ఆకుల ఆనందం, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.