మెదక్ మెడికల్ కళాశాల ఏర్పాటుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సీఎం కేసీఆర్ మెడికల్ కాలేజీని మంజూరు చేస్తూ ఈ ఏడాది జూలైలో ఉత్తర్వులు జారీ చేశారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభం కానుండగా, వంద సీట్లకు అడ్మిషన్లు స్వీకరించేందుకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనుమతులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో శనివారం వైద్య కళాశాల ఏర్పాటుపై ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. కాలేజీతో పాటు హాస్టల్ ఇతరత్రా నిర్మాణాల కోసం రూ.180 కోట్లు మంజూరు చేసింది. జిల్లా కేంద్రంలోని మాతాశిశు సంరక్షణ కేంద్రం పక్కన కాలేజీని నిర్మించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం
చేస్తున్నారు.
– మెదక్ (నమస్తే తెలంగాణ), సెప్టెంబర్ 16
మెదక్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ): మెద క్ మెడికల్ కళాశాలకు రూ.180 కోట్లు మంజూ రు చేస్తూ శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 8 ప్రాంతాల్లో మెడికల్ కళాశాలలకు నిధులు మంజూరు చేయగా, అం దులో మెదక్ మెడికల్ కళాశాలకు రూ.180 కో ట్లు మంజూరు చేసింది. మెడికల్ కళాశాలలో 100 ఎంబీబీఎస్ సీట్లను అందించే సామర్థ్యంతో అభివృద్ధి చేయడంతోపాటు అనుబంధ ప్రభుత్వ దవాఖానను వైద్య సీట్ల సంఖ్యకు అనుగుణంగా అప్గ్రేడ్ చేయనున్నారు. వచ్చే విద్యా సంవత్స రం నుంచి తరగతులు ప్రారంభించనున్నారు. భవనాల నిర్మాణ బాధ్యతలను రోడ్లు, భవనాల శాఖకు అప్పగించగా, ఫర్నిచర్ సమకూర్చే బాధ్యతలను టీఎస్ఎంఎస్ ఐడీసీ హైదరాబాద్కు ప్రభుత్వం అప్పగించింది.
హామీ నిలబెట్టుకున్న కేసీఆర్
గత ఎన్నికల్లో మెదక్కు మెడికల్ కళాశాలను మంజూరు చేస్తామని హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్ మాట నిలబెట్టుకున్నారు. ఈ సంవత్సరం జూలైలో మెదక్కు మెడికల్ కళాశాల మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తరగతుల నిర్వహణ అనుమతుల కోసం మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ప్రతిపాదనలు పంపించారు. ఫలితంగా వచ్చే విద్యాసంవత్సరం నుంచే వంద సీట్ల కు అడ్మిషన్లు స్వీకరించేందుకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనుమతులు ఇచ్చింది. మెదక్కు మెడికల్ కళాశాలకు రూ.180 కోట్లు మంజూరు చేశారు. ఇందులో హాస్టల్ వసతిని కూడా ఏర్పా టు చేయనున్నారు.
నెరవేరిన చిరకాల కోరిక
మెదక్ జిల్లా ప్రజల చిరకాల కోరిక నెరవేరింది. ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి చాలాకాలంగా చేస్తు న్న కృషికి ఫలితం దకింది. ఎమ్మెల్యే కృషితో మెడికల్ కళాశాల ఏర్పాటుకానుంది. ఆవిర్భావం తర్వాత వచ్చే ఏడాది నుంచి వందమంది విద్యార్ధులు ఎంబీబీఎస్ విద్యను అభ్యసించనున్నారు. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆనం దం వెల్లివిరుస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఆరోగ్య తెలంగాణగా మార్చడమే ధ్యేయంగా వైద్యరంగంపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చుతున్నారు. పట్టణాల్లో దవాఖానల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించి, పడకల సంఖ్యను పెంచడంతోపాటు వైద్యుల నియామకాన్ని చేపడుతున్నారు. వైద్యశాలకు కావాల్సిన అన్ని రకాల మౌలిక వసతులను కల్పించనున్నారు.
30 ఎకరాల్లో కళాశాల
మెదక్ జిల్లాకేంద్రంలోని పిల్లికోటాల్ సమీపంలో నూతనంగా నిర్మించిన మాతా, శిశు సంరక్షణ కేం ద్రం(ఎంసీహెచ్) పక్కన మెడికల్ కళాశాలకు 30 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటుకానున్నది. ఈ స్థలా న్ని కళాశాల కోసం అప్పగించారు. అందులో కళాశాల భవన సముదాయం, వసతి గృహం, ప్రత్యే క వార్డులు, బ్లాకులను నిర్మించనున్నారు. ప్రభు త్వం పరిపాలన అనుమతుల జారీతో నిర్మాణ పనులకు అధికారులు శ్రీకారం చుట్టనున్నారు.
చిరకాల కోరిక నెరవేరింది
మెదక్లో ప్రభుత్వం మెడికల్ కళాశాలకు రూ. 180 కోట్లు మంజూరు చేయడం చాలా సంతోషంగా ఉంది. సీఎం కేసీఆర్కు, మంత్రి హరీశ్ రావుకు ధన్యవాదాలు. ప్రభుత్వ మెడికల్ కళాశాల అనేది మెదక్ ప్రజల చిరకాలకోరిక. దీనిని సీఎం కేసీఆర్ నెరవేర్చారు. ఆయన చొరవతో జిల్లాకు మెడికల్ కళాశాల రావడం మన అదృష్టంగా భావించాలి. మెడికల్ కళాశాల ఏర్పాటు తో గ్రామీణ, పట్టణ ప్రాంత విద్యార్థులకు ఉన్న ద విద్య అందుతుంది. డాక్టర్ చదవాలన్న విద్యార్థుల కోరికను సాకారం చేస్తోంది.
త్వరలో జిల్లాలో నర్సింగ్ కాలేజీ కూడా ఏర్పాటు కానున్నది. మెద క్ జిల్లా అభివృద్ధి లో ఒక్కొక్క మె ట్టు ఎక్కుతూ ముందుకు సాగు తున్నాం. కొంత మంది అవగాహనరాహిత్యంతో అవాకులు చెవాకులు చేశారని, ఇప్పుడు వారు ఏం సమాధానం చెబుతారని ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ప్రశ్నించారు. ఇప్పటికైనా వక్రబుద్ధితో మాట్లాడడం మానుకోవాలని హితవు పలికారు.
– పద్మాదేవేందర్రెడ్డి, ఎమ్మెల్యే, మెదక్