గజ్వేల్, జనవరి 5 : తెలంగాణ ప్రభుత్వం క్రీడాకారులకు ప్రోత్సాహాన్ని అందిస్తున్నదని, దీంతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధిస్తున్నారని ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నా రు. గురువారం గజ్వేల్ జీఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాలలో జిల్లాస్థాయి ఇంటర్ పాలిటెక్నిక్ కళాశాలల క్రీడాపోటీలు ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్సీ, ఎఫ్డీసీ చైర్మన్, మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి క్రీడాజ్యోతిని వెలిగించి, జాతీయగీతం ఆలపించారు.
అనంతరం ఎఫ్డీసీ చైర్మన్ టాస్ వేసి క్రీడాపోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో క్రీడాకారులకు చక్కని ప్రోత్సాహం లభిస్తుందన్నారు. సీఎం కేసీఆర్ చొరవతో క్రీడాకారులకు సౌకర్యాలు అందించడంతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో బం గారు, వెండి పతకాలు సాధిస్తున్నారని తెలిపారు. క్రీడాకారుల కోసం 28 ఎకరాల విస్తీర్ణంలో క్రీడాహబ్ను నిర్మించడానికి సీఎం కేసీఆర్ భూమిని కేటాయించారన్నారు. ఈ క్రీడాపోటీల్లోలో 9 కళాశాలలకు చెందిన 450 బాల, బాలికల 13 జట్లు పాల్గొన్నాయి. కబడ్డీ, బ్యాడ్మింటన్, వాలీబాల్, ఖోఖో, చెస్ టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్, రన్నిం గ్ క్రీడాపోటీలు నిర్వహించారు.