నిజాంపేట,ఫిబ్రవరి20 : గిరిజన తండాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని నగరం తండాలో నిర్వహించిన సేవాలాల్ మహరాజ్ విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.
విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలకు విచ్చేసిన ఎమ్మెల్యేకు వేద పండితులు విశ్నేశ్వరశర్మ,సేవాలాల్ కమిటీ సభ్యులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి మాట్లాడుతూ.. అభివృద్ధికి అమడ దూరంలో ఉన్న తండాలకు అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేశారన్నారు. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శమని అన్నారు.