గరుగ గంగ ఒడిలో పుణ్యస్నానం ఆచరించేందుకు వస్తున్న భక్తుల్లో అక్కడి వాతావరణం చూసి భక్తిభావం మరింత ఉప్పొంగుతున్నది. తెలంగాణతోపాటు కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తున్న భక్తులు నదిలో పుణ్యస్నానాలు ఆచరించి నది ఒడ్డున ఉన్న ఆలయాల్లో పూజలు చేస్తున్నారు. న్యాల్కల్ మండలం రాఘవాపూర్-హుమ్నాపూర్ శివార్లలోని సరస్వతీదేవి పంచవటీ క్షేత్రం సమీపంలో గరుడ గంగ పూర్ణ మంజీరా కుంభమేళా భక్తజనంతో కోలాహలంగా మారుతున్నది. ఈ నెల 14న ప్రారంభమైన కుంభమేళాకు శుక్రవారంతో ఐదు రోజులు పూర్తయ్యాయి. కుంభమేళాకు శనివారం నేడు ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు వస్తుండడంతో అధికారులు తగు ఏర్పాట్లు చేశారు. మరోవైపు మెదక్ మండలం పేరూరు సమీపంలో మంజీరా నదిలోనూ పుష్కర స్నానాల సందడి కొనసాగుతున్నది.
Manjeera Pushkaralu | న్యాల్కల్, ఏప్రిల్ 28: మండలంలోని రాఘవపూర్-హుమ్నాపూర్ శివారులోని సరస్వతీదేవి పంచవటీ క్షేత్రం సమీపంలో గరుడ గంగ పూర్ణ మంజీరా నది కుంభమేళాకు తరలివచ్చిన భక్తజనంతో కోలాహలంగా మారింది. ఐదవ రోజైన శుక్రవారం పంచవటీ క్షేత్ర పీఠాధిపతి కాశీనాథ్బాబా ఆధ్వర్యంలో పూజారులు సరస్వతీ దేవి, షిర్డీసాయిబాబా, వేంకటేశ్వస్వామి, సూర్యభగవన్, గంగామాత ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల భక్తులు కుటుంబ సభ్యులతో భారీగా తరలివచ్చి పుణ్యస్నానాలను ఆచరించి, ఆయా ఆలయాల్లో దేవతలకు పూజలు చేశారు. పంచవటీ క్షేత్రం ఆవరణలో యాగశాలలో చండీహోమం, పూర్ణాహుతి, హారతి తదితర ప్రత్యేక పూజలు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన నాగసాధువులు, దిగంబర సాధువులు, స్వామీజీలు భాజాభజంత్రీల హోరు, భజన కీర్తనల మధ్య నృత్యాలు చేస్తూ ఊరేగింపుగా మంజీరా నదికి వెళ్లి అమృత స్నానాలు ఆచరించి, వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య గంగమ్మకు మ హాహారతి ఇచ్చారు. అనంతరం ఆలయ సమీపంలోని ధ్వజాస్తంభం వద్ద ప్రత్యే క పూజలు చేసి, ఆలయంలో గంగామాతను దర్శింకుని ప్రత్యేక పూజ లు చేశారు. పలువురు దాతలు భ క్తులకు అన్నదానం చేశా రు. అక్కమహాదేవి భజ న మండలి సభ్యులు, మహారాష్ట్రకు చెందిన భజన భక్తి మండలికి చెందిన చిన్నారుల సం స్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
భక్తులకు మజ్జిగ పంపిణీ
రాష్ట్ర వీరశైవ జంగం అర్చక పురోహిత సంక్షేమ సంఘం అధ్యక్షుడు పురంతు వీరయ్యస్వామి ఆధ్వర్యంలో రాఘవపూర్ సిద్ధ సరస్వతీదేవి పంచవటీ క్షేత్రంలో భక్తులకు మజ్జిగ ప్యాకెట్లను పంపణీ చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు రాజశేఖర్, ప్రధాన కార్యదర్శి నందీశ్వర్, కోశాధికారి శైలపతి, సంయుక్త కార్యదర్శి మహేశ్, పంచవటీ క్షేత్ర ప్రధాన పూజరి అయ్యప్పస్వామి, సంగారెడ్డి జిల్లా ప్రతినిధి మడుపతి మహేశ్స్వామి, ఉమాశంకర్స్వామి, రాష్ట్ర జంగమ సంఘం సభ్యులు నాగయ్యస్వామి, విజయ్స్వామి, నాగభూషణం, కేదార్నాథ్ స్వామి, అర్చక పురోహితులు తదితరులు పాల్గొన్నారు.
సఖీ సేవలపై అవగాహన
సఖీ కేంద్రం అందించే సేవలను సద్వినియోగం చేసుకోవాలని అడ్మినిస్ట్రేటర్ కల్పన అన్నారు. సంగారెడ్డి కలెక్టర్ శరత్ ఆదేశాల మేరకు మంజీరా తీరంలో సఖీ సేవల కర పత్రాలను భక్తులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, వరకట్నం, లైంగిక వేధింపులు, బాల్య వివాహాలు తదితర వాటి గురించి భక్తులకు అవగాహన కల్పించారు. పోలీసు హెల్ప్లైన్, చైల్డ్ హెల్ప్లైన్లకు అత్యవసర సమయాల్లో సమాచారం అందించాలన్నారు.
కుంభమేళాకు హాజరైన మాధవానంద సరస్వతీ స్వామి
మంజీరా కుంభమేళాకు తొగుట పీఠాధిపతి మాధవానంద సరస్వతీ స్వామి హాజరుకాగా, ఆలయ ప్రధాన అర్చకుడు అయ్యప్పస్వామి ఆధ్వర్యంలో వేదపండితుల పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉత్తర భారతదేశంలోనే కుంభమేళా జరిగేవని, పంచవటీ క్షేత్ర పీఠాధిపతి కాశీనాథ్బాబా ఆధ్వర్యంలో దక్షిణ భారతదేశంలోనే మంజీరా నది తీరంలోని కుంభమేళాను నిర్వహించడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు.
మంత్రి పర్యటనకు ఏర్పాట్ల పరిశీలన
జహీరాబాద్, ఏప్రిల్ 28: గరుడు గంగా మంజీరా కుంభమేళాకు ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు హాజరుకానున్న నేపథ్యంలో ఏర్పాట్లు చేయాలని ఉమ్మడి జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ అధికారులకు, నిర్వహకులకు సూచించారు. శుక్రవారం రాత్రి కుంభమేళా ప్రాంతాన్ని ఆయన అధికారులతో కలిసి పరిశీలించి, కుటుంబ సమేతంగా మంజీరా నదిలో పూజ చేసి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం శివకుమార్ మాట్లాడుతూ మంత్రి హరీశ్రావు శనివారం మంజీరా నదికి చేరుకుని ప్రత్యేక పూజలు చేస్తారని, పంచవటీ క్షేత్రం వద్ద సభ ఏర్పాట్లు చేయాలన్నారు. కార్యక్రమంలో జహీరాబాద్ ఆర్డీవో రమేశ్బాబు, న్యాల్కల్ తహసీల్దార్ ఆటోని, హద్నూర్ ఎస్ఐ వినాయ్కుమార్, పంచవటీ క్షేత్రం పీఠాధిపతి కాశీనాథ్బాబా, వివిధ శాఖల అధికారులు భక్తులు ఉన్నారు.
అసౌకర్యం కలుగకుండా చూడాలి: డీపీవో సురేశ్ మోహన్
సంగారెడ్డి కలెక్టర్ శరత్ ఆదేశాల మేరకు జిల్లా పంచాయతీ అధికారి సురేశ్ మోహన్ మంజీరా ఐకుంభమేళాను సందర్శించారు. నదీ తీరంలోని ఏర్పాట్లను పరిశీలించారు. సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పరిశీస్తూ సాధువులు, భక్తులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీఎల్పీవో రాఘవరావు, తహసీల్దార్ ఆంటోనీ, మండల అభివృద్ధి అధికారి వెంకట్రెడ్డి, పంచాయతీ అధికారి సురేశ్, ఆయా ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.