ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహించడంతో అతి తక్కువ కాలంలో గజ్వేల్ అభివృద్ధి దేశానికే ఆదర్శంగా మారి గొప్పపేరును సంపాదించిందని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. గజ్వేల్లో మంగళవారం పత్తి మార్కెట్, రింగ్ రోడ్డు, మోడల్ బస్టాండ్, అంబేద్కర్ భవనాన్ని ఆయన ప్రారంభించారు. కుకునూరు, వర్గల్, ములుగు, కొండపాక, జగదేవ్పూర్ మండలాల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సమైక్య రాష్ట్రంలో ఈ ప్రాంతంలో దుర్భిక్ష పరిస్థితులు ఉండేవని, రైతు ఆత్మహత్యలు చోటుచేసుకోలేదని అన్నారు. నేడు ముఖ్యమంత్రి కేసీఆర్తో అన్నదాతల్లో ఆత్మవిశ్వాసం పెరిగిందన్నారు. కాళేశ్వరం నీళ్లు రావడంతో సంవత్సరంలో కర్షకులు రెండు పంటలు పండిస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ హయాంలో అన్నీ కష్టాలు ఉండేవన్నారు. ఈసారి సీఎం కేసీఆర్ కామారెడ్డి, గజ్వేల్లో పోటీచేస్తున్న నేపథ్యంలో గజ్వేల్లో కామారెడ్డి కంటే ఎక్కువ మెజార్టీ కట్టబెట్టాలని కోరారు. ఎక్కువ మెజార్టీ ఇస్తే సీఎం కేసీఆర్ను గజ్వేల్ సీటునే ఉంచుకోవాలని విజ్ఞప్తి చేద్దామని మంత్రి హరీశ్రావు పిలపునిచ్చారు.
గజ్వేల్, అక్టోబర్ 3 : గత ప్రభుత్వాల హయాంలో రైతు ఆత్మహత్యలు చూసే వాళ్లమని, తెలంగాణలో కేసీఆర్ వచ్చిన తర్వాతే రైతుల ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం, వ్యవసాయ భూముల విలువ పెరిగిందని, రైతే రాజు అనే నినాదం నిజం చేశారని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. గజ్వేల్లో మంగళవారం పత్తి మార్కెట్ను ప్రారంభించిన సందర్భంగా రైతులనుద్దేశించి ఆయన మాట్లాడారు. కేసీఆర్ సీఎం రాకతో గజ్వేల్లో పాత మార్కెట్ను నేడు రూ.4కోట్లతో అద్భుతంగా మార్చి రైతే రాజుగా చేశారన్నారు. కాంగ్రెస్ హయాంలో రైతులు ఆత్మహత్యలు చేసుకునే వారన్నారు. సీఎం కేసీఆర్ రాకతో రైతుల్లో ఆత్మవిశ్వాసం పెరిగిందని, రైతుబంధును అందించిన ప్రభుత్వం దేశంలోనే బీఆర్ఎస్మాత్రమే నన్నారు కాళేశ్వరం నీళ్లను అందించి సంవత్సరంలో రెండు పంటలు పండించుకునే విధంగా చేశారని, పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేసి మద్దతు ధర కల్పిస్తున్న కేసీఆర్ను మరువొద్దన్నారు.
గతంలో సాగు భూములను అమ్మితే ఐదారు లక్షలు వచ్చేవని, కానీ నేడు కొందామంటే ఎక్కడ కూడా భూములు దొరకడం లేదన్నారు. వానకాలం, యాసంగి పంటలు పండిస్తూనే కొంత మంది రైతులు కూరగాయలు మూడో పంటగా పండించుకుంటున్నారన్నారు. దేశంలో 24గంటల కరెంట్ ఇచ్చే దమ్మున్న లీడర్ ఒక్క కేసీఆర్ మాత్రమేనన్నారు. గుంట ఎండకుం డా పంటలు తీసేలా కరెంట్ ఇస్తున మహనీయుడు కేసీఆర్ అన్నారు. గత కాంగ్రెస్ హయాంలో రైతులు ఎరువుల కోసం చెప్పులు లైన్లో పెట్టి నిలబడితే బస్తా కూడా దొరికేది కాదన్నారు. కానీ కేసీఆర్ ఎరువులు, విత్తనాలు, పెట్టుబడిసాయం, పండించిన పంటను అమ్ముకునేలా కడుపులో పెట్టుకొని చూసుకుంటుంన్నాడన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఉన్నప్పుడు రైతుల బతుకులు దుర్భరంగా ఉండేవని, కేసీఆర్ రాకతో బతుకులు మారాయన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఆరెడు వేల మేగవాట్ల కరెంట్ ఉంటే ఇవాళ 17వేల మేగవాట్ల విద్యుత్ మూడింతలు పెరిగి కరెంట్ వాడుకుంటున్నామన్నారు. దేశంలో జైకిసాన్…జైజవాన్ అంటూ చెతితో చూపించే రైతుల గుండెల్లో కేసీఆర్ కనబడుతున్నారన్నారు. పత్తి మార్కెట్లో 5వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గోదాం మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించడంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు. మా ర్కెట్కు వచ్చిన మంత్రి హరీశ్రావుకు అపూర్వ స్వాగతం లభించింది. కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ రోజాశర్మ, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు నాగిరెడ్డి, ఏఎంసీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి, ఎంపీపీ అమరావతి, జడ్పీటీసీ మల్లేశం, పీఏసీఎస్ చైర్మన్ వెంకటేశంగౌడ్, ఏఎంసీ వైస్ చైర్మన్ ఉపేందర్రెడ్డి, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
రింగ్ రోడ్డును ప్రారంభించిన హరీశ్రావు
గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చుట్టూ 21కిలోమీటర్ల వరకు రూ.305కోట్లతో నిర్మించిన గజ్వేల్ రింగ్రోడ్డును మంత్రి హరీశ్రావు రాజీవ్ రాహదారి పాతూర్ చౌరస్తా రింగ్ వద్ద ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్అండ్బీ అధికారులు మంత్రికి ఘనస్వాగతం పలికారు. అనంతరం మంత్రి సంబంధిత ఆర్అండ్బీ అధికారులు, కాంట్రాక్టర్లను శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో ఎస్ఈ వసంతనాయక్, ఈఈ బాలప్రసాద్, డీఈ రామకృష్ణ, ఏఈలు శ్రీనివాస్, శ్వేత, కాంట్రాక్టర్ బాపినీడు, శ్రీమాన్ పాల్గొన్నారు.
మోడల్ బస్టాండ్ను ప్రారంభించిన మంత్రి
గజ్వేల్ పట్టణ సమీపంలోని తూప్రాన్ మార్గంలో రూ.5కోట్ల తో నిర్మించిన మోడల్ బస్టాండ్ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా బస్టాండ్ పరిసర ప్రాం తాలను పరిశీలించారు. ఆర్టీసీ అధికారుల మంత్రికి స్వాగ తం పలికారు. కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.
అంబేద్కర్ భవనం ప్రారంభోత్సవం
గజ్వేల్ పట్టణంలో రూ.1.90కోట్లతో నిర్మించిన అంబేద్కర్ భవన్నాని మంత్రి తన్నీరు హరీశ్రావు ప్రారంభించారు. ముందు గా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు రాములు, ప్రధాన కార్యదర్శి కిష్టయ్య, సంఘం సభ్యులు ఎల్లయ్య, పి.ఎల్లయ్య, సత్యనారాయణ, కుమా ర్, మైసరాములు, శివకుమార్, తుమ్మ శ్రీనివాస్, యాదగిరి పాల్గొన్నారు.