రామచంద్రాపురం, ఫిబ్రవరి 1: సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీలోని తెల్లాపూర్లో ప్రజా యుద్ధనౌక గద్దర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం బుధవారం రాత్రి అట్టహాసంగా జరిగింది. కార్మిక నాయకులు కొల్లూరి సత్త య్య, కౌన్సిలర్ భరత్, తెల్లాపూర్ ‘గద్దర్ గళం’ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకకు ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్యఅతిథులు గా హాజరై గద్దర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణరావు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో గద్దరన్న పాడి న పాటలు ప్రజలందరినీ ఉద్యమ మార్గంలో నడిపించిందని గుర్తు చేశారు. కౌన్సిలర్ భరత్ గద్దర్ విగ్రహం ఏర్పాటు కోసం ఆమరణ నిరాహార దీక్ష చేయడం పోరాటస్ఫూర్తికి నిదర్శనమని ఉద్ఘాటించారు.
అంతకుముందు సభలో గద్దర్ పాడిన పాటలు ప్రజలను ఉత్తేజపర్చాయి. కార్యక్రమంలో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, ప్రొఫెసర్ కంచె ఐలయ్య షెఫర్ట్, జాతీయ నాయకులు కేబీ.రాజు, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్, సామాజికవేత్త గాదె ఇన్నయ్య, గద్దర్ కుమార్తె వెన్నెల, కుమారుడు సూర్యం, సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి, మున్సిపల్ చైర్పర్సన్ లలితాసోమిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కాటా శ్రీనివాస్గౌడ్, బీఎస్పీ నాయకుడు బాలయ్య, తహసీల్దార్ సంగ్రం రెడ్డి, మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, గాయకురాలు వరం, కౌన్సిలర్లు, బీఆర్ఎస్, కాంగ్రెస్, బీఎస్పీ నాయకులు పాల్గొన్నారు.