రాయికోడ్, జనవరి 20: గ్రామీణ ప్రాంతాల్లో అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని సింగితం, బొగులంపల్లి, కర్చల్, యూసుపూర్, ధర్మాపూర్, రాయికోడ్, అల్లాపూర్, రాయికోడ్ ఎక్స్ రోడ్డులలో పలు అభివృద్ధి పనులకు ఆయన భూమి పూజ, శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రాయికోడ్ మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు.
సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, ఇరిగేషన్ ఎస్ఈ మురళీధర్, సీఈవో జానకీరెడ్డి, డీఎంహెచ్వో గాయత్రి, ఆర్డీవో రాజు, మండల ప్రత్యేకాధికారి జగదీశ్, ఎంపీపీ మమతాఅశోక్కుమార్, జడ్పీటీసీ మల్లికార్జున్పాటిల్, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో ఎంఎం షరీఫ్, ఏఈలు శశికుమార్, జానకీరామ్, ముక్రిద్, మాజీ జడ్పీటీసీ అంజయ్య, మాజీ ఏఎంసీ చైర్మన్ ఏసయ్య, ఎంపీటీసీ మొగులప్ప, నాయకులు సతీశ్ పంతులు, కేదారినాథ్ పాటిల్, ప్రభుచారి, నర్సింహులు ఉన్నారు.