గజ్వేల్, ఏప్రిల్ 2: అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు అనేక హామీలిచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ఇప్పుడు హామీలు అమలు చేయకుండా మోసం చేస్తున్నదని, పదేండ్లలో తెలంగాణకు ఏమీ చేయని బీజేపీని ప్రజలు చిత్తుగా ఓడించాలని మాజీమంత్రి తన్నీరు హరీశ్రావు పిలుపునిచ్చారు. మంగళవారం గజ్వేల్లోని శోభ గార్డెన్లో నిర్వహించిన మెదక్ పార్లమెం ట్ ఎన్నికల సన్నాహక సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గజ్వేల్ అంటే కేసీఆర్ అడ్డా అని, ఎంపీ ఎన్నికల్లో మరోసారి నిరూపించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆరు నెలల్లో ఆరు పార్టీలు మారిన కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు, దుబ్బాక ఉప ఎన్నికల్లో ప్రజలకు అనేక హామీలిచ్చి ఒక్కటి అమలు చేయని బీజేపీ అభ్యర్థి రఘునందన్రావుకు ఓటుతో గుణపాఠం చెప్పాలన్నారు. ఉన్నత విద్యావంతుడు, ప్రజలకు సేవ చేసేందుకు ముందుకొచ్చిన బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని గెలిపించుకోవాలన్నారు. ఆయన సొంత డబ్బులతో ఏర్పాటు చేయబోయే ట్రస్టు ద్వారా పేద పిల్లలకు మేలు జరుగుతుందన్నారు. గజ్వేల్కు ప్రతిష్ట తెచ్చిన కేసీఆర్ను గెలిపించుకొని రుణం తీర్చుకున్న విధంగానే, వెంకట్రామిరెడ్డిని ఎంపీగా గెలిపించుకోవాలన్నారు. గజ్వేల్ అభివృద్ధ్దిని అడ్డుకు నే ప్రయత్నం చేసిన రఘునందన్రావుపై గ్రామాల్లో చర్చ పెట్టాలన్నారు. ఉద్యోగరీత్యా ప్రజలతో సంబంధాలు పెట్టుకుని రాత్రిబవళ్లు కష్టపడి అభివృద్ధికి కృషిచేసిన వెంకట్రామిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని క్యాడర్కు హరీశ్రావు పిలుపునిచ్చారు.
గజ్వేల్ అభివృద్ధికి కేసీఆర్ ప్రభుత్వం చేసిన రూ.150కోట్ల నిధులను సీఎం రేవంత్రెడ్డి రద్దుచేసి ఈ ప్రాంత అభివృద్ధిని అడ్డుకున్నాడని హరీశ్రావు ఆరోపించారు. మన నోట్లో మట్టికొట్టిన కాంగ్రెస్ని ఓటుతో గుణపాఠం చెప్పాలన్నారు. గజ్వేల్ గౌరవాన్ని ఆకాశమం త ఎత్తు తీసుకెళ్లిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. కష్టం వచ్చినప్పుడు పూర్తి అండగా ఉంటానని, భవిష్యత్ మనదే అన్నారు. కార్యకర్తలు, నాయకులు వివాదాలను పక్కనపెట్టి కష్టకాలంలో కేసీఆర్ ప్రతిష్ట కోసం పనిచేయాలని, సొంతపార్టీ గెలుపు కోసం కృషి చేయాలన్నారు. నాలుగు నెలల్లోనే సంక్షేమ పథకాలను ఇవ్వలేని దుస్థితిలో రేవంత్రెడ్డి ప్రభు త్వం ఉందని, ఒక్క హామీ సరిగ్గా అమలు కావడం లేదన్నారు. ఆటోవాలాలు చనిపోతే ఆదుకోవడం లేదని, రేవంత్రెడ్డి మాటలతో సరిపెడుతున్నాడని హరీశ్రావు ఎద్దేవా చేశా రు. బీజేపీ నిరుద్యోగులకు మోసం చేసిందని, అధికారంలోకి వస్తే నల్లధనం తీసుకొచ్చి ప్రతి కుటుంబానికి రూ.15లక్షలు, ఏడాదికి 2కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి హామీ నిలబెట్టుకోలేదన్నారు. దవాఖానల్లో కేసీఆర్ కిట్లు, న్యూట్రిషన్ కిట్లు అందడం లేదని, మూడు నెలలుగా పాడి రైతులకు పాల బిల్లులను ఇవ్వడం లేదని రైతులు తన దృష్టికి తెచ్చారని హరీశ్రావు తెలిపారు.
దేవుడు అందరివాడని, తాను రోజు ఇంట్లో పూజ చేసుకుని హనుమాన్ చాలీసా చదివిన తర్వాతనే బయటకు వస్తానని హరీశ్రావు తెలిపారు. ప్రతి ఇంట్లో దేవుడిని పూజిస్తారని, మన కేసీఆర్ యాదాద్రి నిర్మాణం అద్భుతం గా చేశారన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా యజ్ఞాలు, హోమాలు చేసిం ది మన కేసీఆరే అన్నారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు ఎవరూ గుడికి వెళ్లినా దేవుడు అందరికీ ఒకేలా కనిపిస్తాడని, దేవుడికి రాజకీయాలు ఉండవన్నారు. గజ్వేల్ గడ్డ గురించి ప్రతిఒక్కరికీ చెప్పాలని, పులివెందులకు వైఎస్సార్, కుప్పం ప్రాంతానికి చంద్రబాబు ఎలాగో గజ్వేల్కు కేసీఆర్ అలాగే అని.. గజ్వేల్ కేసీఆర్ అడ్డా అని మరోసారి నిరూపించాలన్నారు. హరీశ్రావు మాట్లాడుతుండగా కరెంట్ పోవడంతో కార్యకర్తలు గొల్లుమంటూ నినాదాలు చేశారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే శశిధర్రెడ్డి, డీసీసీబీ చైర్మన్ దేవేందర్రెడ్డి, కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, డీసీసీబీ డైరెక్టర్ అంజిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, పీఏసీఎస్ చైర్మన్ వెంకటేశంగౌడ్, జహంగీర్, మాదాసు శ్రీనివాస్, దేవీరవీందర్, ప్రభాకర్రెడ్డి, యాదగిరి, జుబే ర్, కృష్ణారెడ్డి, రంగారెడ్డి, యాదవరెడ్డి, శేఖర్గౌడ్, మండలాల పార్టీ అధ్యక్షులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
జిల్లాలో బీఆర్ఎస్ బలంగా ఉందని, ప్రతిపక్షాల పాచికపారదని ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి అన్నారు. వంద రోజుల కాంగ్రెస్ పాల న అట్టర్ప్లాఫ్ అన్నారు. వెంకట్రామిరెడ్డి సమర్థత కలిగిన నాయకుడని, గజ్వేల్తో మంచి సంబంధాలు ఉన్నాయన్నారు.
ఎన్నికల సమయంలో చెప్పే మాయమాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని, రఘునందన్రావు మాటలు నమ్మవద్దని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి అన్నారు. మల్లన్నసాగర్ ప్రజలకు రెట్టింపు పరిహారం ఇప్పిస్తానని ఆయన మోసం చేశాడన్నారు. వంద రోజుల కాంగ్రెస్ పాలనపై ప్రజలు విసుగెత్తారన్నారు. సమావేశానికి వచ్చిన నాలుగు వేల మంది తలుచుకుంటే గజ్వేల్లోనే లక్ష ఓట్ల మెజార్టీ వస్త్తదన్నారు. కేసీఆర్ కట్టించిన ప్రాజెక్టులో నీళ్లు కావాలంటే బీఆర్ఎస్ అభ్యర్థినే గెలిపించుకోవాలన్నారు. గజ్వేల్లో డిపాజిట్ రాని వ్యక్తు లు పెత్తనం చెలాయిస్తున్నారని విమర్శిచారు.
ప్రతి కార్యకర్త గుండెల్లో కుటుంబ సభ్యుడిలా ఉంటానని, ప్రజా సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చానని వెంకట్రామిరెడ్డి అన్నారు. గెలిచిన వెంటనే ప్రతి నియోజకవర్గంలో రూ.2కోట్లతో ఫంక్షన్హాల్ నిర్మించి రూపాయికే శుభకార్యాలకు ఇస్తానన్నారు. తన కుటుంబ సభ్యుల సహకారంతో రూ.100కోట్లతో పేద విద్యార్థు లు, యువతకు నైపుణ్యశిక్షణ, ఉచిత పోటీ పరీక్షలపై శిక్షణ ఇప్పిస్తానన్నారు. సేవా కార్యక్రమాలు చేపడతానని హామీనిచ్చారు. మెదక్ పార్లమెంట్పై పూర్తి అవగాహన ఉన్న వ్యక్తిగా ఢిల్లీలో సమస్యలపై గళం విప్పుతానన్నారు. కేసీఆర్, హరీశ్రావు, కేటీఆర్ ఆశీర్వాదం, సహకారంతోనే పోటీచేస్తున్నట్లు తెలిపారు.
వెంకట్రామిరెడ్డికి భారీ మెజార్టీ వచ్చేలా క్యాడర్ పనిచేయాలని జడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ పిలుపునిచ్చారు. జిల్లాలో పార్టీ ఎం తో పటిష్టంగా ఉందని, ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేస్తే తప్పకుండా ఘనవిజయం తథ్యమన్నారు. జిల్లాలో కలెక్టర్గా ఆయ న సమర్థవంతంగా పనిచేశారని, ఆయనకు అందరితో పరిచయాలు ఉన్నాయన్నారు. గజ్వేల్లో భారీ మెజార్టీని అందించి, వెంకట్రామిరెడ్డిని ఎంపీగా గెలిపించి కేసీఆర్కు బహుమతిగా ఇవ్వాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.