సిద్దిపేట, మార్చి 11: పవిత్ర రంజాన్ ఉపవాస దీక్షలు మంగళవారం ప్రారంభంకానున్న నేపథ్యంలో ముస్లింలకు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాసంలో నిర్వహించే ఉపవాస దీక్షలు, దైవ ప్రార్థనలతో మత సామరస్యం, ఆనందం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతన కలయికే రంజాన్ విశిష్టత అన్నారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో దీక్ష చేస్తున్న ప్రతిఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.