రామాయంపేట, మార్చి 25 : సీఎం కేసీఆర్ రైతు సంక్షే మానికి పెద్దపీట వేస్తున్నారని, కేంద్రం పంటలను కొనుగోలు చేయకున్నా తెలంగాణ ప్రభుత్వమే కొనుగోలు చేసి, రైతులను ఆదుకున్నట్లు మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. రామాయంపేట పట్టణంలో శనివారం ఎమ్మెల్యే పర్యటించారు. మెదక్ జిల్లాలో మొదటిసారిగా ఏర్పాటు చేసిన పీఏసీఎస్ ఆధ్వర్యంలో సన్ఫ్లవర్ కొనుగోలు కేం ద్రాన్ని రామాయంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యా లయంలో ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మా ట్లాడుతూ.. తెలంగాణలో పండిన ధాన్యాన్ని కేంద్ర ప్రభు త్వం కొనుగోలు చేయకున్నా రాష్ట్రమే కొనుగోలు చేసి రైతులకు సకాలంలో డబ్బులను జమ చేశామన్నారు. తెలంగాణ రాష్ట్రంపై కేంద్రం కక్షపూరితంగా వ్యవహరించడం సరికాదన్నారు. రామాయంపేట వ్యవసాయశాఖ డివిజన్లో 354 ఎకరాల్లో సన్ఫ్లవర్ పంటను రైతులు వేశారని తెలిపారు. రైతులు పొద్దుతిరుగుడు పంట ఉత్పత్తులను రామాయం పేటలో ఏర్పాటు చేసిన కోనుగోలు కేంద్రంలోనే విక్రయించాలని సూచించారు. మెదక్ జిల్లావ్యాప్తంగా 2500 క్విం టాళ్ల పొద్దుతిరుగుడు పంట దిగుబడి వస్తుందన్నారు. ప్రభు త్వం క్వింటాలు పొద్దుతిరుగుడుకు రూ.6400 మద్దతు ధర ఇస్తుందని ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి తెలిపారు.
దామరచెరువు బీటీరోడ్డుకు రూ.90లక్షలు
రామాయంపేట మండలం దామరచెర్వు బీటీ రోడ్డుకు రూ.90 లక్షలు మంజూరు చేశామని, త్వరలో రోడ్డు పను లను ప్రారంభిస్తారని తెలిపారు. ప్రస్తుతం రామాయంపేట నుంచి దామరచెర్వు వరకు రోడ్డు పనులు జరుగుతాయన్నా రు. దామరచెర్వు గ్రామంలో రోడ్డు నిర్మాణంతో కొందరు ఇండ్లను ఖాళీ చేయాల్సి వస్తున్నదని, బాధితులకు ఆదుకుం టామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్ గ్రామాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. ప్రతి గ్రామం నుంచి రోడ్డు వేస్తున్నట్లు ఎమ్మెల్యే వివరించారు. మెదక్ నియోజక వర్గంలో తండాల అభివృద్ధికి రూ.98 కోట్లకు ప్రతిపాదనలు పంపగా రూ.58 కోట్లు మంజూరై నట్లు తెలిపారు.
ప్రతి తండాకు రూ.1.50 కోట్లు మంజూరు చేశామన్నారు. ఆయా కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్మన్ జితేందర్గౌడ్, ఎంపీపీ భిక్షపతి, పీఏసీఎస్ చైర్మన్ చంద్రం, మాజీ ఏఎంసీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఆశాకుమారి, ఏడీఏ వసంత సుగుణ, ఏవో రాజ్నారాయణ, బీఆర్ఎస్ పార్టీ మండల, పట్టణాధ్యక్షులు మహేందర్రెడ్డి, నాగరాజు, ఏఎంసీ సూపర్వైజర్ హనుమాండ్లు, దామరచెర్వు సర్పంచ్ శివప్రసాద్రావు, ఎంపీటీసీలు శ్రీలత, చంద్రశేఖర్రావు, కాంట్రాక్టర్ శ్రీధర్రావు, కౌన్సిలర్లు యాదగిరి, నాగరాజు, గంగాధర్, సీఈవో నర్సింహులు, వైస్ చైర్మన్లు స్రవంతి, సులోచన, డైరెక్టర్లు సుధాకర్రెడ్డి, లక్ష్మారెడ్డి, నర్సింహులు, సిద్ధ్దిరాంరెడ్డి పాల్గొన్నారు.