తూప్రాన్/మనోహరాబాద్, సెప్టెంబర్ 2 : పైసా ఖర్చు పెట్టకుండా, ఎలాంటి పైరవీ లేకుండా పేదలకు రెండు పడక గదుల ఇండ్లు నిర్మించి ఇస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ అని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. తూప్రాన్ పట్టణంలో పూర్తయిన 382 డబుల్ బెడ్రూం ఇండ్లను శుక్రవారం ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు. మనోహరాబాద్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక ప్రాథమిక ఆరో గ్య కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం రూ.15 లక్షలతో నిర్మించిన ఎస్సీ కమ్యూనిటీ హాల్, రూ.50 లక్షలతో నిర్మించిన పంచాయతీ భవనం, రూ.20 లక్షలతో నిర్మించిన సెంట్రల్ లైటిం గ్ సిస్టాన్ని ప్రారంభించారు. రూ.2 కోట్లతో నిర్మించనున్న నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం 584 మందికి ఆసరా పింఛన్ పత్రాలను అందజేశారు. తూప్రాన్ టోల్ ప్లాజా వద్ద మున్సిపల్ చైర్మన్ బొంది రాఘవేందర్గౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బాబుల్రెడ్డి ఆధ్వర్యంలో భారీ బైక్ర్యాలీ నిర్వహించి మంత్రికి ఘన స్వాగతం పలికారు.
తూప్రాన్ పట్టణంలో రూ.11 కోట్ల వ్యయంతో నిర్మించిన సమీకృత వెజ్, అండ్ నాన్వెజ్ భవన సముదాయాన్ని ప్రారంభించారు. అనంతరం లక్ష్మీగార్డెన్స్లో నిర్వహించిన కార్యక్రమంలో 420మంది లబ్ధిదారులకు మంజూరైన ఆసరా పిం ఛన్ కార్డులు అందజేశారు. తూప్రాన్ పట్టణంలోని డ్రైనేజీలు, సీసీరోడ్లు, తదితర అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరైనట్లు ప్రకటించారు. అనంతరం పట్టణంలో రూ.25.25 కోట్లతో నిర్మించిన 504 డబుల్ బెడ్రూం ఇండ్లకు గాను పూర్తయిన 382 డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రారంభించారు. ఈ సం దర్భంగా మంత్రి మాట్లాడుతూ మిగిలిన 122 డబుల్ బెడ్రూం ఇండ్లను నెలరోజుల్లో లబ్ధిదారులకు పంపిణీ చేస్తామన్నారు. దసరా తర్వా త సొంత జాగలో ఇల్లు నిర్మించుకునే లబ్ధిదారులకు రూ.3 లక్షల అందజేస్తామన్నారు. డబుల్ బెడ్రూం ఇండ్ల కాలనీలో రేషన్షాపు, అంగన్వాడీ కేంద్రం, బస్తీ దవాఖాన ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి, రాష్ట్ర మాజీ ఫుడ్స్ చైర్మన్ ఎలక్షన్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, కలెక్టర్ హరీశ్, అదనపు కలెక్టర్లు ప్రతిమాసింగ్, రమేశ్, ‘గడా’ ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డి, ఇన్చార్జి ఆర్డీవో వెంకట ఉపేందర్రెడ్డి, తహసీల్దార్ జ్ఞానజ్యోతి, తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ రాఘవేందర్గౌడ్, వైస్ చైర్మన్ శ్రీనివాస్, పీఏసీఎస్ చైర్మన్ మెట్టు బాలకృష్ణారెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బాబు రెడ్డి, పురం మహేశ్, ఎంపీపీలు పురం నవనీతారవి ముదిరాజ్, గడ్డి స్వప్నావెంకటేశ్, జడ్పీటీస రాణి, సర్పంచులు మహిపాల్రెడ్డి, మల్లేశ్ పాల్గొన్నారు.
ముదిరాజ్ల అభివృద్ధికి ప్రభుత్వం కృషి
ముదిరాజ్ల అభివృద్ధికి టీఆర్ఎస్ సర్కార్ కృషి చేస్తున్నదని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. నార్సింగిలో రెడ్డిసంఘం, ముదిరాజ్ భవనాలకు రూ.10లక్షల చొప్పున రూ.20లక్షలతో రెండు భవనాల నిర్మాణాలకు మంత్రి హరీశ్రావు, నాచారం గుట్ట మాజీ చైర్మన్ కొట్టాల యాదగిరితో కలిసి ఎంపీ శుక్రవారం శిలాఫలకం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ముదిరాజ్లు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో చెరువుల్లో చేపపిల్లను వదిలి, మత్స్య సంపదను పెంచందన్నారు. ముదిరాజ్ల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారన్నారు.