నర్సాపూర్/ కొల్చారం/ చిలిపిచెడ్/ నిజాంపేట/ వెల్దుర్తి/ తూప్రాన్, అక్టోబర్ 1 : బీఆర్ఎస్తోనే రైతు సంక్షేమం సాధ్య మని, రైతుల కోసం ఇంటి ఎదుట ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, మద్దతు ధర ఇన్నదని ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. జిల్లావ్యాప్తంగా వివిధ గ్రామాల్లో బుధవారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను పీఏసీఎస్, ఐకేపీ అధికారులు ప్రారంభించారు. నర్సాపూర్లోని మార్కెట్తోపాటు చిన్నచింతకుంటలో ఐకేపీ కొనుగోలు కేంద్రాలను జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ మెర్సినా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో రైతులు ధాన్యాన్ని విక్రయించి మద్దతు ధర పొందాలని, దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. ఏపీఎం గౌరీశంకర్ మాట్లాడుతూ.. రైతులు పండించిన చివరి గింజ వరకూ కొనుగోలు చేస్తామన్నారు. ఆయా కార్యక్రమాల్లో మహిళా మండల సమాఖ్య అధ్యక్ష, కార్యదర్శులు మమత, గీత, అకౌంటెంట్ మల్లేశం, ఆపరేటర్ సురేశ్, సీసీ ప్రవీణ, సీఏలు నాగరత్నమ్మ, లక్ష్మి, రైతులు రాజూయాదవ్, లింగం, వెంకటేశ్, రమేశ్ పాల్గొన్నారు.
* ఐకేసీ డీపీఎం జాన్ కెనడీ, సీఈవో రాములు
కొల్చారం మండలంలోని పోతంశెట్పల్లి రైతువేదిక వద్ద ఐకేసీ ధాన్యం కొనుగోలుకేంద్రాన్ని ఐకేపీ డీపీఎం జాన్ కెనడీ, ఎంపీడీవో గణేశ్రెడ్డి ప్రారంభించారు. వరిగుంతం గ్రామంలో పీఏసీఎస్ కేంద్రాన్ని చైర్మన్ చిన్నారం ప్రభాకర్, సీఈవో రాములు ప్రారంభించారు. రైతులకు మద్దతు ధర కల్పించడానికే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నద న్నారు. రైతులు దళారులను ఆశ్రయించి నష్టపోవద్దన్నారు. కేంద్రాలకు నాణ్యమైన ధాన్యం తీసుకువచ్చి ప్రభుత్వ మద్దతు ధర పొందాలన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ముత్యంగారి సంతోష్కుమార్, శ్రీకాంత్, మాజీ సర్పంచ్ శ్రీధర్గౌడ్, ఏపీఎం సుసిల్వ, సీసీ తనూజ, సీఏలు నర్సింహులు, యాదగిరి, కార్యదర్శి అరుంధతి పాల్గొన్నారు.
చిలిపిచెడ్ మండలకేంద్రంతో పాటు చిట్కుల్, చండూర్, ఫైజాబాద్, సోమక్కపేట, అజ్జమర్రి తదితర గ్రామాల్లో సోమక్కపేట వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలోని కొను గోలు కేంద్రాలను సీఈవో పోచయ్య, తహసీల్దార్ ముసాదీక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల్లో క్వింటాలు ఏ గ్రేడ్ ధాన్యానికి రూ. 2,203, బీ గ్రేడ్ ధాన్యానికి రూ.2,183 మద్దతు ధరతో కొనుగోలు చేస్తున్నామన్నారు. రైతులు ధాన్యం తెచ్చే సమయంలో ఆధార్కార్డు, బ్యాంక్ అంకౌట్ పత్రాలను తీసుకుని రావాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు కేంద్రాల్లో ఏర్పాట్లుచేశామని తెలిపారు. కార్యక్రమంలో ఏఈవోలు భూపాల్, రమ్య, ఉప సర్పంచ్ రాజ్కుమార్, పీఏసీఎస్ డైరెక్టర్ శ్రీనివాస్రెడ్డి, రైతులు నరేందర్రెడ్డి, జగన్మోహన్రెడ్డి, చంద్రశేఖర్రెడ్డి, రాంరెడ్డి, ఖాసీం, దేవేందర్రెడ్డి, శ్రీధర్రెడ్డి, నాందేవ్, మల్లేశం, రమేశ్ పాల్గొన్నారు.
వెల్దుర్తి మండలంలోని మహ్మద్నగర్తండా, దామరంచ పంచాయతీ అక్కమ్మపల్లి గ్రామంలో కొనుగోలు కేంద్రాలను డీఆర్డీఏ పీడీ శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల్లో రైతుకు మద్దతు ధర అందించి ఆదుకోవాలనే లక్ష్యంతో ప్రభుత్వం పీఏసీఎస్, ఐకేపీ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ధాన్యంలో తేమ లేకుండా పూర్తిగా ఆరబెట్టి కొనుగోలు కేంద్రా లకు తేవాలని రైతులకు సూచించారు. ధాన్యం కొనుగోలు పూర్తికాగానే ఆన్లైన్లో వివరాలు నమోదు చేస్తామన్నారు. కార్యక్రమంలో అదనపు డీఆర్డీఏ భీమయ్య, డీపీఎంలు మో హన్, వెంకటేశ్వర్లు, ఏపీఎం శంకరయ్య పాల్గొన్నారు.
తూప్రాన్ మండలంలోని ఆరు గ్రామాల్ల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎంపీడీవో అరుంధతి ప్రారంభించారు. ఇస్లాంపూర్, దాతర్పల్లి, గుండ్రెడ్డిపల్లి, మల్కాపూర్, వట్టూర్, కిష్టాపూర్ గ్రామాల్లో ఐకేపీ కేంద్రాలు ప్రారంభించారు. కార్యక్రమంలో ఐకేపీ డీపీఎం ప్రకాశ్, ఏపీఎం రుక్మిణి ఉన్నారు.
కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని డీసీవో ఆఫీస్ అసిస్టెంట్ రిజిస్టార్ పండిత్ సూచించారు. నిజాంపేటతోపాటు రజాక్పల్లి, కల్వకుంట గ్రామాల్లో పీఏసీఎస్ కేంద్రాలను ప్రారంభించారు. ధాన్యంలో మట్టి, తాలు గింజలు లేకుండా రైతులు జాగ్రత్తపడాలన్నారు. కార్యక్రమం లో ఏఈవోలు శ్రీలత, కావేరి, సీఈవోలు శోభారాణి, గోపాల్రెడ్డి, పీఏసీఎస్ సహాయ కార్యదర్శి మహిపాల్ ఉన్నారు.