చేగుంట, ఏప్రిల్ 20: మెదక్ జిల్లా చేగుంట మండలలోని పలు గ్రామాల్లో ఆదివారం సాయంత్రం కురిసిన వడగండ్లకు అపార నష్టం జరిగింది. వందలాది ఎకరాల్లో వడ్లు, మామిడికాయలు పూర్త్తిగా నేలరాలడంతో రైతులు కన్నీటి పర్యంతమయ్యా రు.
చేగుంట మండలంలోని కర్నాల్పల్లి, మక్కరాజిపేట్, గొల్లపల్లి,రాంపూర్ తదితర గ్రామాల రైతులు సోమవారం చేగుంట-గజ్వేల్ రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం ఎకరాకు రూ.50వేల పరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేశారు. ఘటనా స్థలానికి చేగుంట తహసీల్దార్ శివప్రసాద్, ఎస్సై చైతన్యకుమార్ రెడ్డి చేరుకుకొని రైతులను సముదాయించారు. ప్రభుత్వానికి నివేదిక పంపంచి బాధిత రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.