అల్లాదుర్గం, జూన్ 4: ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్తే అక్కడ నెల రోజులైనా ధాన్యాన్ని తరలించడకపోవడంతో ఆగ్రహించిన రైతులు సంగారెడ్డి జిల్లా అల్లాదుర్గం మండలంలోని ఐబీ చౌరస్తా-వట్పల్లి రహదారిపై తడిపిన ధాన్యంతో గురువారం ఆందోళన చేపట్టారు.
దీంతో రహదారిపై ఎ్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తూకం వేయడానికి 10 నుంచి 15 రోజులు, ధాన్యాన్ని తరలించడానికి మరో పది రోజులు పడుతున్నదని రైతు లు ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోళ్లలో వేగం చేయకపోవడం, లారీల కొరత కారణంగా 20 రోజులకు పైగా ఇబ్బందులు పడుతున్నామని పేర్కొన్నారు. తూకం వేసిన ధాన్యం తరలించకపోవడంతో గురువారం కురిసిన వర్షంతో పూర్తి తడిసిపోయిందని వారు తెలిపారు.
రైతులు నష్టపోతున్నా కేంద్రాల నిర్వాహకులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. విషయాన్ని తెలుసుకున్న అల్లాదుర్గం సీఐ రేణుకారెడ్డి, అల్లాదుర్గం, పెద్దశంకరంపేట ఎస్ఐలు శంకర్, ప్రవీణ్రెడ్డి, తహసీల్దార్ మల్లయ్య, ఎంపీడీవో వేదప్రకాశ్రెడ్డి అక్కడికి చేరుకుని రైతులకు నచ్చచె ప్పే ప్రయత్నం చేశారు. ధాన్యాన్ని లారీల్లో తరలించే వరకు ఇక్కడి నుం చి జరిగే ప్రసక్తే లేదని రైతుల భీష్మించుకూర్చున్నారు. రైస్మిల్లర్లు, పై అధికారులతో మాట్లాడి సాయంత్రానికి లారీలు వచ్చే ఏ ర్పాటు చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళనను విరమించారు.