మనోహరాబాద్: రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి అన్నారు. శివ్వంపేట మండలం సికింద్రాపూర్, పెద్దగొట్టిముక్ల, గోమారం, శివ్వంపేట, మనోహరాబాద్ మండలం పోతారంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా వ్యవసాయ అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ అనేక పథకాలను ప్రవేశపెడుతున్నారన్నారు. వరి కొనుగోలు ఇబ్బందికరమైనా రైతులు నష్టపోకూడదని సీఎం కేసీఆర్ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయిస్తున్నారన్నారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, కొనుగోలు కేంద్రాల వద్ద విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు.
శివ్వంపేట మండలం గోమారం చెరువులో ప్రభుత్వం ఉచితంగా అందజేసిన చేప పిల్లలను ఎమ్మెల్యే నీటిలో వదిలారు. మనోహరాబాద్ మండలం పోతారంలో రూ. 2.70 లక్షల సర్పంచ్ మాదవరెడ్డి, దాతల సహకారంతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ప్రారంభించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజరమణగౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, జడ్పీ కో ఆప్షన్ మెంబర్ మన్సూర్, పీఏసీఎస్ చైర్మన్ వెంకట్రామిరెడ్డి, వైస్ చైర్మన్ వేణుగోపాల్, ఎంపీటీసీ శ్రీలతఆనంద్, సర్పంచ్లు లావణ్యమాదవరెడ్డి, చంద్రకళ, సుధాకర్రెడ్డి, మాదవరెడ్డి, అర్జున్, వెంకటేశ్వర్లు, ఉప సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షుడు రేణుకుమార్, ఉప సర్పంచ్ వీరేశ్, నాయకుడు బడికోలు ప్రభాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.