మెదక్ : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. శివంపేట మండలం పెద్ద గొట్టుముక్ల గ్రామంలో విద్యుత్ షాక్ కు గురై కౌలు రైతు మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన కుమ్మరి పెంటయ్య (35) అనే రైతు బౌరంపేటకు చెందిన ఓ వ్యక్తి పొలాన్ని కుమ్మరి పెంటయ్య కౌలుకు చేస్తున్నాడు. రోజులాగే ఉదయం పొలంలో కలియతిరిగేందుకు వెళ్లాడు.
అయితే శనివారం రాత్రి విద్యుత్ వైర్ తెగి పొలానికి ఉన్న ఫెన్సింగ్ పై పడటంతో రైతు పెంటయ్య గమనించకుండా ఫెన్సింగ్ వైర్ ను దాటే క్రమంలో ఒక్కసారిగా విద్యుత్ షాక్ కు గురయ్యాడు. చుట్టుపక్కల రైతులు గమనించి కుటుంబీకులకు తెలిపారు. మృతదేహాన్ని నర్సాపూర్ ప్రభుత్వ దవాఖానకు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు కొడుకులు ఉన్నారు. పెంటయ్య మృతిలో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
|