ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ప్రతిభ దాగి ఉంటుంది. దానిని వెలికితీసి ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వివిధ రంగాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అన్నదాతలు, విద్యావేత్తలు, వ్యాపారులు, ఉద్యోగులు, గృహిణులు ఇలా ఎవరైనా ఆవిష్కరణలు చేయవచ్చు. తమ ఆలోచనలకు సృజనాత్మకతను జోడించి పూర్తి వివరాలతో ప్రయోగాలను ఆన్లైన్లో దరఖాస్తు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ ఆవిష్కరణలను ఎంపిక చేసి ప్రోత్సాహక బహుమతులను అందజేస్తుంది.
– మెదక్ మున్సిపాలిటీ, జూలై 5
మెదక్ మున్సిపాలిటీ, జూలై 5: వివిధ వర్గాలకు చెందిన వారిలో సృజనాత్మకతను వెలికి తీసి ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిఏటా ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఏ వృత్తిలో ఉన్నా కొత్త ఆలోచనలు ఉన్నవారు ఇందులో పాల్గొనే అవకాశం కల్పించారు. తమ ఆలోచనలకు సృజనాత్మకతను జోడించి పూర్తి వివరాలతో ప్రయోగాలను ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఈనెల 25వ తేదీ వరకు గడువు ఉండగా.. ఆగస్టు 15న జిల్లాస్థాయిలో ఆవిష్కరణలను ప్రదర్శిస్తారు. వీటిలో ఉత్తమమైన వాటికి ప్రభుత్వం ప్రోత్సాహక బహుమతులను అందజేయనున్నది.
ప్రతిఒక్కరిలో ఏదో ఒక ప్రతిభ దాగి ఉంటుంది. దానిని వెలికితీసి ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వివిధ రంగాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అన్నదాతలు, విద్యావేత్తలు, వ్యాపారులు, ఉద్యోగులు, గృహిణులు ఇలా ఎవరైనా ఆవిష్కరణలు చేయవచ్చు. వాటిని ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం రోజున ప్రదర్శిస్తారు. జిల్లా, రాష్ట్రస్థాయిలో ఉత్తమ ఆవిష్కరణగా ఎంపికైన వాటికి రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహక బహుమతులు అందజేస్తుంది.
స్థానిక సమస్యల పరిష్కారమే లక్ష్యంగా..
మన చుట్టుపక్కల, ఇండ్లు, విద్యాలయాలు, వ్యవసాయం, ఇతర సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా ఆవిష్కరణలు చేయాలి. ఇప్పటికే ఉన్న వస్తువుల్లో కొన్ని మార్పులు చేర్చి కొత్త వాటిని రూపొందించవచ్చు. మీరు రూపొందించే ఆవిష్కరణ అందరి మెప్పు పొందేలా ఉండాలి.
ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి..
ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమంలో పాల్గొనడానికి https:www.teamtsic.org వెబ్సైట్లో ఈనెల 25వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. ఆవిష్కరణల వివరాలను ఆగస్టు 5వ తేదీలోగా వాట్సాప్ 9100678543కి పంపాలి. అందులో ఆవిష్కరణకు సంబంధించి ఆరు వాక్యాల వివరణ ఉండాలి. రెండు నిమిషాల నిడివి వీడియో, నాలుగు ఫొటోలు తీసి పంపాలి. ఆవిష్కరణ పేరు, సెల్ఫోన్ నంబర్, వయస్సు, ప్రస్తుత వృత్తి, గ్రామం/పట్టణం, జిల్లా పేరు రాయాలి.
విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకోవాలి
ప్రతి వ్యక్తిలో దాగి ఉన్న ఆలోచనలను వెలికితీసి వాటిని ఆవిష్కరణలుగా మార్చి సమాజంలోని సమస్యలను పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు, గృహిణులు, రైతులు, వివిధ రంగాల్లో పనిచేస్తున్న వారు ఎవరైనా పాల్గ్గొనవచ్చు. జిల్లా, రాష్ట్రస్థాయిలో ఉత్తమమైన వాటిని ఎంపిక చేసి బహుమతులు అందజేస్తారు. సందేహాలు ఉంటే 8328599157 నంబర్ను సంప్రదించాలి. అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి.
– రాజిరెడ్డి, ఇంటింటా ఇన్నోవేటర్ జిల్లా సమన్వయకర్త