చేర్యాల, డిసెంబర్ 30: కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ప్రతి ఇంటికీ అమలు చేయాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి కోరారు. శనివారం చేర్యాల మండలంలోని చుంచనకోట, ముస్త్యాల గ్రామాల్లో నిర్వహించిన ప్రజాపాలన గ్రామసభలకు హాజరై దరఖాస్తుల స్వీకరణ, ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలు కోరుకున్న విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నేరవేర్చాలని, వాటికి కొర్రీలు పెట్టొద్దన్నారు. గ్రామాలు, పట్టణాలను అభివృద్ధి చేసుకోవాలనేది తన అభిప్రాయమన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అన్ని వర్గాల ప్రజాప్రతినిధులను గౌరవించుకున్నామన్నారు. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు ప్రజలతో దరఖాస్తులు చేయించాలని, ఎలాంటి తప్పులు దొర్లకుండా చూడాలని సూచించారు. చుంచనకోట గ్రామంలోనే తనకు అత్యధిక ఓట్లు వచ్చాయని, రానున్న రోజుల్లో గ్రామాభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేస్తానన్నారు.
భువనేశ్వరి మాత ఆలయంలో ప్రత్యేక పూజలు
చుంచనకోటలో భువనేశ్వరిమాత ఆలయంలో అమ్మవారిని ఎమ్మెల్యే దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం చేర్యాలలోని మున్సిఫ్ కోర్టులో పనులు పరిశీలించారు. కావాల్సిన నిధుల విషయమై మంత్రులు, అధికారులను కలిసి వినతిపత్రం అందజేస్తానని తెలిపారు. కార్యక్రమాల్లో ఎంపీపీ ఉల్లంపల్లి కరుణాకర్, ఏఎంసీ చైర్మన్ సుంకరి మల్లేశంగౌడ్, వైస్ ఎంపీపీ తాండ్ర నవీన్రెడ్డి, స్పెషల్ ఆఫీసర్ శ్రీరాంరెడ్డి, తహసీల్దార్ రాజేశ్వర్రావు, ఎంపీడీవో మహబూబ్ అలీ, సర్పంచ్లు ఆది శ్రీనివాస్, పెడుతల ఎల్లారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ వంగా చంద్రారెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అనంతుల మల్లేశం, ఏఎంసీ వైస్ చైర్మన్ పుర్మ వెంకట్రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ నిమ్మ రాజీవ్రెడ్డి, ముస్త్యాల బాల్నర్సయ్య, శ్రీధర్రెడ్డి, రంజితాకృష్ణమూర్తి, కిష్టయ్య, బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జింకల పర్వతాలుయాదవ్, కౌన్సిలర్ పచ్చిమడ్ల సతీశ్, గోనె హరి తదితరులు పాల్గొన్నారు.
మద్దూరులో..
మద్దూరు(ధూళిమిట్ట), డిసెంబర్ 30: అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందించాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. మద్దూరు మండలంలోని సలాఖపూర్, ధూళిమిట్ట మండలంలోని బైరాన్పల్లి గ్రామాల్లో సర్పంచ్లు వంగ భాస్కర్రెడ్డి, బండి శ్రీనివాస్ల అధ్యక్షతన ప్రజాపాలన గ్రామసభలు నిర్వహించారు. బైరాన్పల్లి బురుజు వద్ద పల్లా రాజేశ్వర్రెడ్డి అమరవీరులకు నివాళులర్పించారు. ఇటీవల మృతిచెందిన రిటైర్డు ఉపాధ్యాయుడు వంటేరు లింగారెడ్డి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పరామర్శించారు. కార్యక్రమంలో ఎంపీపీ బద్దిపడిగె కృష్ణారెడ్డి, చేర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ సుంకరి మల్లేశం, వైస్ఎంపీపీ మలిపెద్ది సుమలతా మల్లేశం, పీఏసీఎస్ చైర్మన్ నాగిళ్ల తిరుపతిరెడ్డి, తహసీల్దార్లు అనంతరెడ్డి, శ్రీనివాస్రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు మేక సంతోశ్కుమార్, మంద యాదగిరి, ఎంపీటీసీలు ఇర్రి రాజేశ్వర్రెడ్డి, నందనబోయిన నర్సింహులు, కురుమ సంఘం మండల అధ్యక్షుడు రాజమల్లయ్య, పాల్గొన్నారు.
కొమురవెల్లిలో…
కొమురవెల్లి, డిసెంబర్ 30: మండలంలోని రసూలాబాద్, రాంసాగర్, కిష్టంపేట, లెనిన్నగర్లో ఆరు గ్యారెంటీల అమలులో భాగంగా అధికారులు ప్రజాపాలన కార్యక్రమంలో ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. రసూలాబాద్లో కార్యక్రమాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీపీ తలారి కీర్తనాకిషన్, జడ్పీటీసీ సిలువేరు సిద్దప్ప, పీఏసీఎస్ చైర్మన్ వంగ చంద్రారెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గీస భిక్షపతి, వైస్ ఎంపీపీ రాజేందర్రెడ్డి, సర్పంచ్ పచ్చిమడ్ల స్వామిగౌడ్ పాల్గొన్నారు. రసూలాబాద్లో కొన్నినెలల క్రితం తాటి చెట్టుపై నుంచి ప్రమాదవశాత్తు కింద పడి నడవలేక ఇబ్బందులు పడుతున్న పచ్చిమడ్ల మల్లయ్యగౌడ్ను ఎమ్మెల్యే పరామర్శించారు.