రేగోడ్/ పెద్దశంకరంపేట/ అల్లాదుర్గం, జనవరి 12 : రేగోడ్ మండలకేంద్రంలోని ప్రభుత్వ దవాఖానను జిల్లా వైద్యాధికారి చందునాయక్ గురువారం తనిఖీ చేశారు. దవాఖానలో వైద్య సేవలను పరిశీలించి, వైద్య సిబ్బందితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వైద్యాధికారి చందునాయక్ మాట్లాడుతూ.. గర్భిణులకు సరైన వైద్యం అందిచాలన్నారు. దవాఖానలో సాధారణ ప్రసవాలకు ప్రాధాన్య త ఇస్తూ సరైన వైద్యసేవలు అందించాలని సూచించారు. త్వరలో చేపట్టనున్న కంటి వెలుగు శిబిరాలను సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. ప్రజలకు ఏవిధమైన ఇబ్బంది రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సమావే శంలో డాక్టర్ శ్వేత, సీహెచ్వో సిద్దప్ప, వైద్య సిబ్బంది ఈశ్వర్గౌడ్, రోజలిన్, ఏఎన్ఎంలు తదితర్లున్నారు.
వైద్యులు, వైద్యసిబ్బంది నిర్లక్ష్యం వీడాలి
వైద్య సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవని జిల్లా వైద్యాధికారి చందునాయక్ హెచ్చరించారు. పెద్దశంకరంపేట ప్రభుత్వ దవాఖానను తనిఖీ చేసి, రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ దవాఖాన ఆవరణలో పరిసరాల పరిశుభ్రత పాటించాలని వైద్యసిబ్బందికి సూచిం చారు. కంటి వెలుగులో భాగంగా ప్రతిరోజు 150 మందికి కంటి చికిత్స నిర్వహించాలని సూచించారు. కంటి వెలుగుపై గ్రామాల్లో అంగన్వాడీ కార్యకర్తలు, ఏఎన్ఎంలు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో వైద్యాధికారి సారిక, వైద్య సిబ్బంది సంపూర్ణ, భూమయ్య, రామ్మోహన్, వెంకటేశం, సాయిలు పాల్గొన్నారు.
విధులు సక్రమంగా నిర్వహించాలి
అల్లాదుర్గం మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖాన ను జిల్లా వైద్యాధికారి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోగులకు వైద్యసేవలు అందించడం లో నిర్లక్ష్యం వీడాలని సూచించారు. గడిపెద్దాపూర్ ఆరోగ్య కేంద్రంలో పారిశుధ్యం అస్తవ్యస్తంగా ఉందన్నారు. దవాఖా నలో పరిశుభ్రత పాటించాలని సిబ్బందిని ఆదేశించారు.
దోమలతోనే ఫైలేరియా వ్యాప్తి
దోమకాటుతోనే బోధకాల వ్యాధి వస్తున్నదని, పరిసరాలను శుభ్రంగా ఉంటే వ్యా ధులను నివారించవచ్చని జిల్లా మలేరియా ఇన్చార్జి అధి కారి కుమారస్వామి, డిప్యూటీ డీఎంహెచ్వో వినీల పేర్కొన్నారు. అక్కన్నపేటలో బోధకాలు నివారణ చర్యలు చేపట్టారు. జిల్లాలోని 1863 మంది బోధకాలకు గురైనట్లు తెలి పారు. రామాయంపేట, నిజాంపేట ఉమ్మడి మండలాలలో 561మందిని బోధకాలు బాధితులను గుర్తించామన్నారు.
రామాయంపేట, నిజాంపేట మండలాల్లో 18 ఏండ్లకు పైబడినవారు 73వేల మంది ఉన్నారని, వీరందరికీ కంటి పరీక్షలు చేస్తామన్నారు. కార్యక్రమంలో పీహెచ్ఎన్ఎం సత్త మ్మ, ఏఎన్ఎంలు ఎల్లమ్మ, ఆశవర్కర్లు రాణి, లక్ష్మి, రాధిక, పుష్ప, మాజీ సర్పంచ్ సిద్ధిరాములు పాల్గొన్నారు.