చేగుంట,జూన్20 : చేగుంట పట్టణ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి పేర్కొన్నారు. చేగుంట ఎంపీపీ మాసుల శ్రీనివాస్, ఎంపీటీసీ అయిత వెంకటలక్ష్మి, సొసైటీ డైరెక్టర్ రఘురాములు ఆధ్వర్యంలో చేగుంటకు చెందిన ఎస్సీ, ఎస్టీ నాయకులు హైదరాబాద్లోని మెదక్ ఎంపీ క్యాప్ కార్యాలయంలో సోమవారం కలిసి వినతి పత్రం సమర్పించారు.
చేగుంట పట్టణ అభివృద్ధితో పాటు, ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన కమ్యూనిటీ హాల్ ఏర్పాటుకు కృషి చేయాలని కోరగా ఎంపీ సానుకూలంగా స్పందించారు. చేగుంట పట్టణ అభివృద్దికి సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాల కోసం నిధులు మంజూరు చేసినట్లు ఎంపీ తెలిపారు. కాగా, అభివృద్ధికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటే ఉన్నామన్నారు.
రాబోయే ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీతోనే ఉంటామని వారు తెలిపారు. కార్యక్రమంలో చేగుంట టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఎర్ర యాదగిరి, సిరుగోజు సత్యనారాయణ, బక్క దశరథ, మైసయ్య, నర్సింహులు, రాములు, ఆగం తదితరులున్నారు.