చిన్నశంకరంపేట, నవంబర్25 : చిన్నశంకరంపేట మండలంలోని ఖాజాపూర్ గిరిజన తండా అభివృద్ధి కోసం కృషి చేస్తానని ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి హామి ఇచ్చారు. గురువారం మండల పరిధిలోని ఖాజాపూర్ గిరిజన తండాకు చెందిన టీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి నివాస గృహానికి వెళ్ళి గ్రామాభివృద్ధికి నిధులను కేటాయించాలని వినతి పత్రాన్ని అందించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి మాట్లాడుతూ.. తండా అభివృద్ధికి నిధులను కేటాయిస్తానని హామి ఇచ్చారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలశాఖ అధ్యక్షుడు పట్లోరి రాజు, మాజీ ఎంపీటీసీ లాల్యానాయక్, ఖాజాపూర్ గిరిజన తండా టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.