చిలిపిచెడ్, జనవరి 20: సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, అధికారులు కలిసి గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. శనివారం చిలిపిచెడ్ ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ వినోదాదుర్గారెడ్డి అధ్యక్షతన సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యదర్శులు, ఆయా శాఖల అధికారులతో గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక (జీపీడీపీ) సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 2023-24కి అధికారుల సహకారంతో గ్రా మాల అభివృద్ధి ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. చిలిపిచెడ్లో కరెంట్ తారువైరు ఏర్పాటు చేయాలని ఎన్నిసార్లు చెప్పినా ఏఈ పట్టించుకోవడంలేని సర్పంచ్ లక్ష్మీదుర్గారెడ్డి ఎమ్మెల్యే దృష్టికి తేవడంతో ఏఈ రాంబాబుపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశా రు. ఈ నెల 25వ తేదీ నాటికి పూర్తి చేయాలని ఏఈని ఎమ్మెల్యే ఆదేశించారు. కరెంట్ 24 గంటలు వస్తుందా? మండలంలో ఎన్ని సబ్స్టేషన్లు ఉన్నా యి? అని ఏఈ రాంబాబును ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. త్వరంలో గంగారం నుంచి ఫైజాబాద్ బీటీ రోడ్డు పనులు చేపట్టాలని పీఆర్ ఏఈ మధుబాబును ఆదేశించారు. సమావేశంలో ఎంపీడీవో శశిప్రభ, ఎంపీవో, ఆయా గ్రామాల సర్పంచులు గోపాల్రెడ్డి, పరశురాంరెడ్డి, శంకర్నాయక్, యాదగిరి, రాకేశ్నాయక్, కవిత, మనోహర, ఇస్తారి, ఎం పీటీసీలు మల్లయ్య, మల్లమ్మ, సుభాష్రెడ్డి, ఏపీవో శ్యామ్కుమార్, ఏపీఎం ప్రేమలత పాల్గొన్నారు.