దుబ్బాక, నవంబర్ 24: కులమతలకతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తూ, గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డి సతీమణి మంజులత అన్నారు. మారుమూల తండాలను పంచాయతీలుగా మార్చి గిరిజనులకు పాలనాధికారం కల్పించి సముచిత గౌరవం కల్పించిన నాయకుడు మన సీఎం కేసీఆర్ అని పేర్కొన్నారు. శుక్రవారం దుబ్బాక మండలం వెంకటగిరితండా, శిలాజీనగర్, గంభీర్పూర్ గ్రామాల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. వెంకటగిరితండాలో గిరిజన మహిళలు మంజులతతో కలిసి లంబాడీ నృత్యం చేశారు. ఈ సందర్భంగా మంజులత మాట్లాడుతూ.. ప్రభాకర్రెడ్డిని రెండు సార్లు ఎంపీగా ఢిల్లీకి పంపారని, అదే ప్రేమాభిమానాలతో దుబ్బాక ఎమ్మెల్యేగా గెలిపించి అసెంబ్లీకి పంపించాలని కోరారు. ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే రఘునందన్రావు మూడేండ్లలో ఒక్క పైసా పని చేయలేదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొత్త పుష్పలతాకిషన్రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర యువజన నాయకులు సోలిపేట సతీశ్రెడ్డి, సర్పంచ్లు పెంటవ్వాబాలకిషన్, శ్రీనివాస్, భాస్కర్, ఎంపీటీసీ మాధవి, బీఆర్ఎస్ నాయకులు బనాల శ్రీనివాస్, భీమాసేనా, పరశురాములు, మహిపాల్రెడ్డి, రామచంద్రం ఉన్నారు.
దుబ్బాక టౌన్, నవంబర్ 24: కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఇంటి పార్టీ బీఆర్ఎస్ను గెలిపించుకొని మూడోసారి ముఖ్యమంత్రిగా గెలవబోతున్న కేసీఆర్కు మరింత బలాన్ని అందించాలని బీఆర్ఎస్ vఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డి సతీమణి మంజులత పిలుపునిచ్చారు. శుక్రవారం మున్సిపాలిటీ పరిధిలోని లచ్చపేట, ధర్మాజీపేట, చేర్వాపూర్ వార్డుల్లో చైర్పర్సన్ గన్నె వనితతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు కూరపాటి బంగారయ్య, నందాల శ్రీజశ్రీకాంత్, స్వామి, కనకయ్య, బాలకృష్ణ, మూర్తి సంధ్యారాణి శ్రీనివాస్రెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ సిద్దిరాములు, జిల్లా యువజన విభాగం నాయకుడు సోలిపేట సతీశ్రెడ్డి, పార్టీ మున్సిపల్ శాఖ అధ్యక్షుడు వంశీ, నాయకులు ఎర్రగుంట ప్రసాద్, శ్రీరాం రవీందర్, గుండబోయిన వెంకటేశ్వర్, శ్రీశైలం, ధాత్రిక భాగ్యలక్ష్మి, బాలకృష్ణ, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.