చిలిపిచెడ్, ఏప్రిల్ 7: మండలంలో భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో కొన్నిచోట్లు వరి పొలాలు ఎండిపోతున్నాయి. యాసంగికి మంచి దిగుబడులు సాధిస్తామనుకున్న రైతుల ఆశలు ఆవిరయ్యాయి.
చిలిపిచెడ్ మండలంలోని బండపోతుగల్ గ్రామానికి చెందిన రైతు నవాజ్ సాగుచేస్తున్న మూడెకరాల వరి పొలానికి బోరు నుంచి సరిపడా నీరురాక పూర్తిగా ఎండిపోయింది. పెట్టుబడికి పెట్టిన ఖర్చులు రాకపోవడంతో రైతు నవాజ్ తన పొలంలో కన్నీటి పర్యంతమయ్యాడు. పొలం పూర్తిగా ఎండిపోవడంతో పశువులకు మేతగా మారిందని, ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.