కొమురవెల్లి, మే 6: ఒట్టు వేసుడు రేవంత్రెడ్డి వంతే, ఒట్టును గట్టు మీద పెట్టుడు ఆయన వంతే అని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. సోమవారం కొమురవెల్లి మండల కేంద్రంతో పాటు కిష్టంపేట, గౌరాయపల్లి, మర్రిముచ్చాల, లెనిన్నగర్, రాంగసాగర్, రసూలాబాద్, ఐనాపూర్, తపాస్పల్లి, పోసాన్పల్లి, గురువన్నపేటలో భువనగిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేశ్కు మద్దతుగా ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆహామీలను అమలు చేయమంటే ముఖ్యమంత్రి రేవంత్ పండబెట్టి తొక్కుతా.. గుడ్లు పీకుతా.. పేగులు మేడల వేసుకుంటా అని తిట్ల దండకం మొదలు పెట్టాడన్నారు. రేవంత్ తీరు చూస్తుంటే ఐతే ఓట్లు లేదంటే తీట్లు అని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రైతులకు రెండు పంటలకు పుష్కలంగా నీరు ఇస్తే నేడు కాంగ్రెస్ హయాంలో కరువు కష్టాలు వచ్చాయన్నారు. కాల్వలో ఉన్న నీళ్లను ఎత్తిపోయని మీకు ఓట్లు ఎందుకు వేయాలో చెప్పాలని ప్రశ్నించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే రూ.2లక్షల రుణమాఫీ, రైతుబంధు ఎకరాకు రూ.15వేలు, పింఛన్ రూ.4వేలు, మహిళలకు రూ.2500, కల్యాణలక్ష్మి కింద వధువుకు తులం బంగా రం, నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ రూ పొందించి మెగా డీఎస్సీ వేస్తామని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభు త్వం వీటిలో ఏ ఒక్కటైనా అమలు చేసిందా అని ప్రశ్నించారు. పార్లమెంట్ ఎన్నికలు ఉన్నందునే సీఎం రేవంత్రెడ్డి మరోసారి కొమురవెల్లి మల్లన్న, యాదాద్రి నరసన్న మీద ఒట్టు పేరుతో ముందుకు వస్తున్నాడని మండిపడ్డారు. యాదాద్రిని అద్భుతంగా నిర్మించిన కేసీఆర్ ఏఒక్క రోజు కూడా రాజకీయం చేయలేదని, అయోధ్యలో రామమందిరం నిర్మిస్తే దానిని బీజేపీ ఓట్లకు వాడుకుంటుందని విమర్శించారు. తెలంగాణ గలం పార్లమెంట్లో వినిపించాలంటే బీసీ బిడ్డ బీఆర్ఎస్ భువనగిరి ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేశ్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ తలారి కీర్తనాకిషన్, జడ్పీటీసీ సిలువేరు సిద్ధప్ప, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గీస భిక్షపతి, పీఏసీఎస్ చైర్మన్ వంగ చంద్రారెడ్డి, వైస్ ఎంపీపీ కాయిత రాజేందర్రెడ్డి, భారత జాగృతి రాష్ట్ర నాయకుడు విజేందర్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బొడిగం కృష్ణారెడ్డి, గొల్లపల్లి కిష్టయ్య, బుడిగె గురువయ్యగౌడ్, మల్లేశం, ముత్యం నర్సింహులు, కృష్ణాగౌడ్, కొండ శ్రీధర్, ఎంపీటీసీలు, ఆయా గ్రామశాఖ అధ్యక్షులు,మాజీ సర్పంచ్లు, నాయకులు పాల్గొన్నారు.