సంగారెడ్డి కలెక్టరేట్, డిసెంబర్ 19: ఆర్థిక మద్దతు పథకాల లక్ష్యసాధనకు బ్యాంకర్లు సహకరించాలని సంగారెడ్డి జిల్లా డీఆర్వో నగేశ్ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో బ్యాంకర్లు, సిద్దిజిల్లాస్థాయి అధికారులతో రైతులకు రుణాల పంపిణీ, స్వయం సహాయక సంఘాల రుణాలు, రికవరీ, పీఎంజీపీవై రుణాలు, ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమశాఖల పథకాలకు సంబంధించిన రుణ లక్ష్య పురోగతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడూతూ ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రాధాన్యత, ప్రాధాన్యేతర రంగాలకు సంబంధించి జిల్లాలో రూ.7,800 కోట్ల రుణాలు అందించడం లక్ష్యం కాగా, ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు వివిధ బ్యాంకులు రూ.7,911.21 కోట్ల రుణాలు అందించినట్లు ఎల్డీఎం గోపాల్రెడ్డి తెలిపారు. అనంతరం నాబార్డుకు సంబంధించిన 2024-25 పొటెన్షియల్ లింక్డ్ క్రెడిట్ ప్లాన్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఎల్డీఎం గోపాల్రెడ్డి, ఆర్బీఐ ఏజీఎం తాన్యా, నాబార్డు డీడీఎం కృష్ణ, డీఆర్డీవో శ్రీనివాసరావు, జడ్పీసీఈవో ఎల్లయ్య, మెప్మా పీడీ గీత, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.