మెదక్, ఏప్రిల్ 10 (నమస్తేతెలంగాణ): తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల యంత్రాంగాన్ని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు. బుధవారం సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్లో అధికారులతో మాట్లాడారు. వేసవిలో తాగునీటి సరఫరా ప్రణాళిక, ధాన్యం కొనుగోలు, పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనపై, వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేశారు. మెదక్ కలెక్టరేట్ నుంచి కలెక్టర్ రాహుల్రాజ్, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు రమేశ్, సంబంధిత అధికారు లు వీడియో కా న్ఫరెన్స్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. ఎక్కడ తాగునీటి సమస్య ఉత్పన్నమైనా వెంట నే చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి జిల్లాలో తాగునీటి సరఫరా సమస్యల పరిషారానికి కం ట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి చర్యలు తీసుకోవాలన్నారు.
2023-24కు సంబంధించి సీఎంఆర్ రా రైస్ డెలివరీ వేగవంతం చేయాలని, ఎఫ్సీఐకి నిర్దేశిత సమయానికి డెలివరీ చేయాలని సీఎస్ శాంతికుమారి ఆదేశించారు. యాసంగి ధాన్యాన్ని మద్దతు ధరకు రైతుల నుంచి సేకరించాలన్నారు. వడగాల్పులు వీస్తున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విస్తృత ప్రచారం కల్పించాలన్నారు.