మెదక్, జనవరి 23 (నమస్తే తెలంగాణ) : ఎస్సీ, ఎస్టీల గౌరవానికి భంగం కలిగించొద్దని మెదక్ కలెక్టర్ రాజర్షి షా సూచించారు. మెదక్ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో మంగళవారం కలెక్టర్ అధ్యక్షతన జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ‘షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల అట్రాసిటీ చట్టంపై విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమీక్ష’ నిర్వహించారు. ఎమ్మెల్సీలు శేరి సుభాష్రెడ్డి, యాదవరెడ్డి కార్యక్రమానికి హాజరై సంబంధిత శాఖల అధికారులు ప్రవేశపెట్టిన నివేదికలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులైన దళితుల పట్ల పోలీసులు, ఇతర శాఖల అధికారులు సున్నితంగా వ్యవహరించాలని, వారికి వ్యవస్థలపై విశ్వాసం కలిగించేలా పనితీరు ఉండాలని పేరొన్నారు. మూడు నెలలకోసారి ఈ కమిటీ సమావేశం నిర్వహించాలని సూచించారు.
అనంతరం ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి మాట్లాడుతూ కేసుల్లో బాధితులకు ఇవ్వాల్సిన పరిహారం సకాలంలో అందించి వారికి సాంత్వన కలిగేలా చూడాలన్నారు. సాధారణ కేసుల్లో పోలీస్స్టేషన్లకి వెళ్తున్న ప్రజల పట్ల కూడా సున్నితంగా, సామరస్యంగా మెదిలేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ బాలస్వామికి ఎమ్మెల్సీ సూచించారు. అలాగే, సర్పంచుల సమస్యలను త్వరగా పరిషరించాలని కలెక్టర్ను కోరారు. అనంతరం ఎమ్మెల్సీ యాదవరెడ్డి మాట్లాడుతూ సమాజంలో అందరూ సమానమేనని, ఎలాంటి వివక్ష లేకుండా సమాజంలో కలసిమెలిసి జీవించాలన్నారు. సమీక్షా సమావేశంలో ఎస్పీ బాలస్వామి, అదనపు కలెక్టర్లు రమేశ్, వెంకటేశ్వర్లు, జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి విజయలక్ష్మి, సంబంధిత శాఖల అధికారులు, ఆర్డీవోలు, డీఎస్పీలు, విజిలెన్స్ కమిటీ సభ్యులు, తదితరలు ఉన్నారు.