మెదక్, జనవరి 24 (నమస్తే తెలంగాణ) : మెదక్ జిల్లాలో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. నాలుగు రోజులుగా 19,459 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఇందులో 3,743మందికి కంటి అద్ధాలను అందజేశారు. ఈ సందర్భంగా డీఎంహెచ్వో డాక్ట ర్ చందునాయక్ మాట్లాడుతూ మంగళవారం 4595 మందికి కంటి పరీక్షలు చేశామని, ఇందులో 2134 మంది పురుషులు కాగా, 2461 మంది మహిళలు ఉన్నారని చెప్పా రు. 625మందికి కంటి అద్ధాలను అందజేశారు. మరో 512 మందికి అద్దాల కోసం రెఫర్ చేశామని చెప్పారు. జిల్లా వ్యా ప్తంగా 40బృందాలు పాల్గొంటున్నాయని, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండి శిబిరాల వద్దకు వచ్చిన ప్రజలకు కంటి పరీక్షలు చేస్తున్నారని తెలిపారు.
17456 మందికి కంటి పరీక్షలు
సంగారెడ్డి జనవరి 24 (నమసే తెలంగాణ) : సంగారెడ్డి జిల్లాలో కంటివెలుగు కొనసాగుతున్నది. మంగళవారం సం గారెడ్డి జిల్లాలో 69కంటి వెలుగు వైద్య శిబిరాల్లో పరీక్షలు నిర్వహించారు. మొత్తం 17,456 మందికి కంటి పరీక్షలు చేశారు. గ్రామాల్లో 11213మంది, మున్సిపాలిటీల్లో 4355 మంది, జీహెచ్ఎంసీలో 1888మంది కంటి పరీక్షలు చేయించుకున్నారు. కంటి పరీక్షలు చేయించుకున్న 17,456 మంది లో 8131మంది పురుషులు, 9326మంది మహిళలు ఉన్నా రు. పరీక్షలు చేయించుకున్న వారిలో 2749మందికి అద్దాలు అందజేశారు. ప్రిస్కిప్షన్ కళ్ల అద్దాలు 1650 మందికి అవసరమని గుర్తించారు. 2130మందికి ఆపరేషన్లు అవసరమని గుర్తించగా అందులో 1019మంది పురుషులు, 1111 మం ది మహిళలకు కంటి ఆపరేషన్లు చేయించుకోవాల్సిందిగా వైద్యులు సూచించారు. హత్నూర మండలం చింతల చెరువు గ్రామంలో నిర్వహిస్తున్న కంటివెలుగు వైద్య శిబిరాన్ని కలెక్టర్ శరత్ సందర్శించారు. కంటిపరీక్షలు నిర్వహిస్తున్న తీరును కలెక్టర్ శరత్ పరిశీలించారు. రోగులతో కొద్దిసేపు మాట్లాడారు. కళ్ల అద్దాలు ఇస్తున్నారా తదితర విషయాలను కలెక్టర్ శరత్ ఆరా తీశారు.
అందత్వ రహిత తెలంగాణే ప్రభుత్వ లక్ష్యం
జిన్నారం, జనవరి 24 : అంధత్వ రహిత తెలంగాణ లక్ష్యంగా ప్రభుత్వం కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిందని సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ అన్నారు. జిన్నారం పంచాయతీ కార్యాలయంలో కొనసాగుతున్న కంటివెలుగు కార్యక్రమాన్ని మంగళవారం పరిశీలించారు. కంటి పరీక్షలు చేయించుకున్న వారితో కలెక్టర్ ప్రత్యేకంగా ముచ్చటించారు. జిల్లాలో ప్రతి ఒక్కరికీ కంటి పరీక్షలు నిర్వహించేలా 69 టీంలతో కార్యక్రమాన్ని రూపొందించినట్లు చెప్పారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 64వేలకు పైగా కంటి అద్దాలు తెప్పించి సిద్ధంగా ఉంచామన్నారు.
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పరిశీలన
జిన్నారంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ డాక్టర్ శరత్ పరిశీలించారు. పదో తరగతి విద్యార్థులతో ప్రత్యేకంగా మాట్లాడారు. పదో తరగతి ప్రత్యేక తరగతుల గురించి హెచ్ఎం నరేశ్బాబు, ఉపాధ్యాయులతో మాట్లాడి ప్రత్యేక తరగతుల నిర్వహణ ప్రణాళికను అడిగి తెలుసుకున్నారు.
కంటి వెలుగును సద్వినియోగం చేసుకోవాలి
అందోల్, జనవరి 24: సీఎం కేసీఆర్ ప్రజలకు కంటి సమ స్యలను దూరం చేయాలనే ఉద్ధేశంతోనే కంటి వెలుగు కార్య క్రమాన్ని ఏర్పాటు చేశారని ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ తెలిపారు. మండలంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు కార్యక్రమాన్ని పరిశీలించి, వైద్యులతో మాట్లాడారు. ఆయన వెంట మున్సిప ల్ చైర్మన్ మల్లయ్య, వైస్ చెర్మన్ ప్రవీణ్, కమిషనర్ రవిబా బు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
శిబిరాన్ని సందర్శించిన కలెక్టర్ శరత్
అమీన్పూర్, జనవరి 24: ప్రతి ఒక్కరూ కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని కండ్ల సమస్యలను దూరం చేసుకోవాలని సంగారెడ్డి కలెక్టర్ శరత్ సూచించారు. మండలంలోని సుల్తాన్పూర్ పంచాయతీ కార్యాలయంలోని కంటివెలుగు శిబిరాన్ని సందర్శించి పరిశీలించారు. వైద్యులు చేస్తున్న సేవలను పరిక్షించారు.
కంటి వెలుగును ప్రతిష్టాత్మకంగా అమలు చేయాలి
జహీరాబాద్, జనవరి 24: కంటి వెలుగు పథకాన్ని విజయవంతం చేసేందుకు వైద్యులు, సిబ్బంది, ఆశ కార్యకర్తలు కలిసి పని చేయాలని అడిషనర్ కలెక్టర్ రాజార్షిషా తెలిపారు. మంగళవారం మండలంలోని హోతి(బి), మొగుడంపల్లి, జహీరాబాద్ పట్టణంలోని 17వార్డుల్లో నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాలను సందర్శించి సూచనలు చేశారు. శిబిరం లో ప్రతి ఒక్కరూ అందుబాటులో ఉండి సేవలు అందించాలన్నారు. అడిషనల్ కలెక్టర్ వెంట ఎంపీడీవో సుమతి, ము న్సిపల్ కమిషనర్ మల్లారెడ్డి, ఎంపీవో మహేశ్ ఉన్నారు.