మెదక్/మెదక్ రూరల్ మార్చి 29 : నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారుల పెండింగ్ చలాన్లకు రాయితీతో ఈ నెల 31 వరకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. దీంతో వాహనదారులు చలా న్లు కట్టేందుకు మీ-సేవల వైపు పరుగులు తీస్తున్నారు. ఈ-చలానా బకాయిలు భారీగా పేరుకుపోవడంతో ప్రభు త్వం వాహనదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నెల 1 నుంచి 31 వరకు జరిమానాలో 20 నుం చి 80 శాతం వరకు రాయితీతో చెల్లించే అవకాశం కల్పించింది. జరిమానాలో రాయితీ ప్రకటించడంతో వాహనదారులు మీ-సేవ కేంద్రాలు, సెల్ ఫోన్లలో ఆన్లైన్ విధానంలో ఈ-చలాన్లు చెల్లిస్తున్నారు. పోలీసులు కూడా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తూ జరిమానా చెల్లింపుపై అవగాహన కల్పించారు. మరో రెండు రోజు ల్లో గడువు ముగియనుండడంతో పోలీసులు బకాయిల వసూలుపై మరింత దృష్టి పెట్టారు. ఇలాంటి అవకాశం మళ్లీ రాదని, సద్వినియోగం చేసుకోవాలని వాహనదారులకు సూచిస్తున్నారు.
ఇటీవల పెండింగ్లో ఉన్న వాటికి రాయితీని పలు శాతాలుగా కల్పిస్తూ పోలీసు శాఖ తీసుకున్న నిర్ణయంతో జిల్లాలో పలువురి వాహనదారులకు ఊరట లభించింది. ఈ నెలాఖరు వరకు పెండింగ్ చలాన్లు కట్టుకునేందుకు అవకాశం ఉండడంతో కొందరు సద్వినియోగపర్చుకుంటున్నారు. ద్విచక్రవాహనాలు, ఆటోలకు 75 శాతం రాయితీ, నాలుగు చక్రాలు, లారీలకు 50 శాతం, ఆర్టీసీ బస్సులకు 70 శాతం రాయితీ, నో మాస్క్ చలాన్లు కూడా రూ. వెయ్యి ఉంటే రూ.వంద చెల్లించాల్సి ఉండడంతో ఈ కేటగిరీ వారికి ఊహించని లాభం చేకూరుతుంది. మెదక్ జిల్లాలో చాలా మం ది ఆన్లైన్, మీ-సేవ ద్వారా చెల్లిస్తున్నారు.
జరిమానాలో రాయితీ ప్రకటించడంతో వాహనదారులు మీ-సేవ కేంద్రాలు, సెల్ఫోన్లల్లో ఆన్లైన్ విధానంలో ఈ- చలాన్లు చెల్లిస్తున్నారు. అయితే ప్రభుత్వం ఇచ్చిన గడువు రెండు రోజులు మాత్రమే ఉంది. ఆన్లైన్ ద్వారా చెల్లించుకునే అవకాశం ఉందని, http:// echallan.tspolice.gov.in/ వెబ్సైట్లో పూర్తి వివరాలు తెలుసుకోవచ్చని పోలీసులు సూచిస్తున్నారు. ఈ లింక్ ద్వారా ఎంటర్ కావాలి.. అందులో వాహనం వివరాలు పొందుపర్చాలి. ప్రత్యేక అప్లికేషన్ డిస్కౌంట్ పోను ఎంత మొత్తం చెల్లించాలో చూపిస్తోంది. ఈ నెల 31 వరకు కట్టని వారికి వచ్చే నెల 1 నుంచి జిల్లాలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి జరిమానా కట్టించడంతో పాటు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
రెండు రోజులు మాత్రమే గడువు ఉంది. ఈ-చలానా వెబ్సైట్లోకి వెళ్లి వాహనం నంబర్ ఎంటర్ చేస్తే ఎన్ని ఫైన్లు ఉన్నా యి. డిస్కౌంట్ ఎంత ఉంది.. చెల్లించాల్సింది ఎంత అనే వివరాలు చూపుతుంది. గడువులోగా జరిమానా చెల్లించి రాయి తీ అవకాశం వినియోగించుకోవాలి. ఏప్రిల్ 1 తర్వాత పెండింగ్ చలాన్లు కట్టకుండా ఉన్న వాహనదారులపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తాం.
-రోహిణిప్రియదర్శిని, ఎస్పీ, మెదక్