గజ్వేల్ అర్బన్, అక్టోబర్ 26: కేసీఆర్ను మూడోసారి సీఎంగా చేయడమే లక్ష్యంగా ప్రతి నాయకుడు, కార్యకర్త పనిచేయాలని ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి, మాజీ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్రెడ్డి పిలునిచ్చారు. గురువారం గజ్వేల్లోని ప్రజ్ఞా గార్డెన్స్లో మున్సిపల్ బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. సమావేశంలో వారు మాట్లాడుతూ.. ప్రతి కార్యకర్త, నాయకుడు సీఎం కేసీఆర్ ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలను, అభివృద్ధిని వివరించి, కేసీఆర్ను గజ్వేల్ నుంచి భారీ మెజార్టీతో గెలిపించుకోవాలన్నారు. ఇంటింటికీ ప్రభుత్వం నుంచి ఏదోవిధంగా లబ్ధి చేకూరిందన్నారు. చేసిన పనులను ప్రజలకు వివరించి భవిష్యత్తులో సీఎం కేసీఆర్ చేయబోయే పనులను వివరించాలన్నారు. సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జకీయొద్దీన్, జడ్పీటీసీ పంగమల్లేశం, ఆత్మకమిటీ చైర్మన్ ఊడెం కృష్ణారెడ్డి, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు నవాజ్మీరా,
కౌన్సిలర్లు పాల్గొన్నారు.