నర్సాపూర్, ఏప్రిల్ 5 : ప్రస్తుతం మార్కెట్ రంగంలో డిజిటల్ చెల్లింపులు జోరందుకున్నాయి. చిన్నచిన్న వ్యాపారాలను మొదలుకొని పెద్దపెద్ద షాపింగ్ మాల్స్లో డిజిటల్ (ఆన్లైన్) చెల్లింపులు సర్వసాధారణంగా మారిపోయాయి. డిజిటల్ పేమెంట్ సంస్థలు స్వయంగా దుకాణదారుల వద్దకు వచ్చి ఆన్లైన్ చెల్లింపుల కోసం క్యూఆర్ కోడ్లను అందజేస్తున్నారు. డిజిటల్ పేమెంట్ సంస్కృతి కూరగాయల దుకాణదారుల వద్ద పాకింది. నర్సాపూర్ మున్సిపల్ పరిధిలో విక్రయదారులు ఆన్లైన్ ద్వారా కూరగాయలను అమ్మడానికి ఉత్సాహం చూపుతున్నారు. ప్రతి కూరగాయల దుకాణాల వద్ద డిజిటల్ పేమెంట్కు సంబంధించిన క్యూఆర్ కోడ్లను ఏర్పాటు చేసుకొని విక్రయిస్తున్నారు. కస్టమర్లకు చిల్లర బెడద లేకుండా క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపులు జరిపేలా ఏర్పాటు చేసుకున్నారు. డిజిటల్ చెల్లింపులతో నగదు నేరుగా దుకాణదారుల ఖాతాల్లో జమ కావడంతో ఉత్సాహం కనబరుస్తున్నారు. ఇక వినియోగదారుల అకౌంట్లో డబ్బులు ఉంటే డిజిటల్ పేమెంట్లు చేసి వారి అవసరాలను తీర్చుకుంటున్నారు. కేవలం కూరగాయల దుకాణాలే కాకుండా పండ్లు, పూల దుకాణాలు, చిరు వ్యాపారులు, రోడ్డు పక్కన ఉండే అమ్మకందారులు క్యూఆర్ కోడ్లను ఏర్పాటు చేసుకొని వ్యాపారాలను కొనసాగిస్తున్నారు.
క్యూఆర్ కోడ్తో మాకు చిల్లర బెడద తప్పింది. రెండేండ్లుగా డిజిటల్ పేమెంట్ ద్వారా కూరగాయలను విక్రయిస్తున్నా. కస్టమర్లు కూడా పెరిగి వ్యాపారం లాభసాటిగా మారింది. గతంలో చిల్లరకు చాలా ఇబ్బందిగా ఉండేది. డిజిటల్ పేమెంట్ సంస్థ ఏజెంట్లు స్వయంగా మా వద్దకు వచ్చి క్యూఆర్ కోడ్లను అందజేసి ప్రోత్సహిస్తున్నారు.
-యాదగిరి, కూరగాయల దుకాణదారుడు