ములుగు, జూన్ 17 : ధరణి ఆధారిత భూసమస్యలను త్వరితగతిన పరష్కరించాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు. ములుగు తహసీల్ కార్యాలయంలో పైలట్ ప్రాజెక్ట్ కింద జరుగుతున్న భూరికార్డుల పరిశీలనను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. అధికారులు గ్రామాలకెళ్లి, రైతుల ముందే ధరణి ఆధారిత భూసమస్యలను పరిష్కరించాలని సూచించారు. వందశాతం భూసమస్యలను పరిష్కరించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ములుగును పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిందని, అధికారులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని పని చేయాలని సూచించారు.
పహానీలను నిక్షిప్తంగా పరిశీలించి నిజమైన యజమానులకే భూపై హక్కులు కల్పించాలని ఆదేశించారు. భూమి బదిలీ ప్రక్రియ వేగవంతం చేయాలన్నదే ధరణి ఉద్దేశమని, అధికారులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం భూసమస్యలపై వచ్చిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్రెడ్డి, ఆర్డీవో విజయేందర్రెడ్డి, తహసీల్దార్ ప్రవీణ్రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ రఘువీర్రెడ్డి, రెవెన్యూ అధికారులు ఉన్నారు.