వర్గల్/పాపన్నపేట, ఫిబ్రవరి 18: పవిత్ర పుణ్యక్షేతం ఏడుపాయల వనదుర్గాభవానీ ఆలయానికి భక్తులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు మంజీరా నది పాయల్లో పుణ్యస్నానాలు చేసి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారికి ఒడిబియ్యం, కుంకుమార్చనలు, తలనీలాలు, బోనాలు సమర్పించారు. వర్గల్ విద్యాసరస్వతీమాత, నాచగిరి లక్ష్మీనృసింహస్వామి ఆలయాల్లో భక్తులు ఆదివారం పూజలు చేశారు.
సెలవుదినం కావడంతో దేవతామూర్తులను దర్శించుకునేందుకు భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. తీర్థప్రసాదాల స్వీకరణ అనంతరం మహాఅన్నప్రసాదంలో పాల్గొన్నారు. ఆలయ కార్యనిర్వాహకులు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేశారు.