పాపన్నపేట, ఏప్రిల్ 21: పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గా భవానీమాతను ఆదివారం భక్తులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు మంజీరానదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏడుపాయల చైర్మన్ బాలాగౌడ్, ఆలయ ఈవో మోహన్రెడ్డి, సిబ్బంది ఏర్పాట్లు చేశారు. వేద పండితులు శంకరశర్మ, పార్థివ శర్మ, మురళీధర్, రాజశేఖర్ ప్రత్యేక పూజలు నిర్వహించగా, పాపన్నపేట ఎస్సై నరేశ్ బందోబస్తు చర్యలు చేపట్టారు.