పాపన్నపేట, ఫిబ్రవరి 4 : మెదక్ జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గా భవానీమాత ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఆదివారం వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మంజీరా నదిలోని వివిధ పాయల్లో పుణ్యస్నానాలు ఆచరించి దుర్గామాతను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీ చైర్మన్ బాలాగౌడ్, ఈవో మోహన్రెడ్డి, సిబ్బంది సూర్య శ్రీనివాస్, మధుసూదన్రెడ్డి, రవివీర్ కుమార్, లక్ష్మీనారాయణ, ప్రతాప్రెడ్డి, నర్సింహులు, వరుణాచారి, రాజు, శ్రీకాంత్, సంతోష్, యాదగిరి ఏర్పాట్లు చేశారు. వేద పండితులు శంకరశర్మ, పార్థీవశర్మ, మురళీధర్ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. పాపన్నపేట ఎస్సై నరేశ్ సిబ్బందితో కలిసి బందోబస్తు నిర్వహించారు.