శివ్వంపేట, సెప్టెంబర్ 9 : మండలంలోని చిన్నగొట్టిముక్ల పంచాయతీలో అటవీప్రాంతంలో స్వయంభుగా వెలిసిన ప్రసిద్ధ్ద పుణ్యక్షేత్రం చాకరిమెట్ల సహకార ఆంజనేయస్వామి ఆలయం శనివారం జనసంద్రంగా మారింది. శ్రావణమాసం చివరి శనివారం సందర్భంగా భక్తులు భారీసంఖ్యలో ఆల యానికి పోటెత్తారు. ఆలయ ఫౌండర్, చైర్మన్ భాస్కరరాయిని ఆంజనేయశర్మ, ప్రధాన అర్చకుడు దేవదత్తుశర్మ ఆధ్వర్యంలో భక్తులు ఆంజనేయస్వామికి చందనాభిషేకం, విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సత్యనారాయణస్వామి వ్రత మండపం పూర్తిగా కిక్కిరిసింది. భక్తులు సామూహిక సత్యనారాయణస్వామి వ్రతాలు నిర్వహించారు. సీతారామచంద్రస్వామి దేవాలయంలో సైతం భక్తులు ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. ఈవో సార శ్రీనివాస్ ఆలయం లో భక్తులకు ఏర్పాట్లు చేయించారు. ఆలయం వద్ద ఎలాంటి నీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఎస్సై రవికాంత్రావు ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో పూజారులు దేవీపంతులు, ప్రభురాజశర్మ, శ్రీవాత్సవశర్మ, సిబ్బంది రామకృష్ణ, ప్రకాశ్, శ్రీనివాస్ ఉన్నారు.
శివ్వంపేటకు చెందిన స్వర్గీయ కొడకంచి సత్యాగౌడ్ జ్ఞాపకార్థం ఆయన కుమారులు, బీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్గౌడ్, రవీందర్గౌడ్, నర్సింలుగౌడ్లు చాకిరిమెట్ట ఆంజనేయ స్వామి ఆలయంలో అన్నదానం ఏర్పాటు చేశారు. దాదాపు 3వేల మందికి పైగా అన్నదానం చేసినట్లు తెలిపారు. నాలుగు వారాలుగా భక్తులకు అన్నదానం చేస్తున్న సత్యాగౌడ్ కుమా రులను ఆలయ వర్గాలు, భక్తులు సన్మానించారు.
రామాయంపేట/ మనోహరాబాద్/ చేగుంట, సెప్టెంబర్ 9 : రామాయంపేటలో కోటి పుష్పార్చన ఘనంగా జరిగింది. గోదాసమేతా పద్మావతి, వేంకటేశ్వరాలయంలో ఉత్సవ విగ్రహాలకు 116 మంది దంపతులు కోటి పుష్పార్చన చేశారు.
రామాయంపేటలో భక్తమార్కండేయ ఆలయ 6వ వార్షి కోత్సవాలు ఘనంగా జరిగాయి. స్వామివారికి భక్తులు అభిషేకాలు, నైవేద్యాలు, మంగళహారతులు సమర్పించారు. ఆల య కమిటీ నేతృత్వంలో శివపార్వతుల కల్యాణం నిర్వహిం చారు. ఉత్సవాల్లో నిర్వాహకులు మద్దెల సత్యనారాయణ, పద్మశాలీ సంఘం మండలాధ్యక్షుడు మద్దెల రమేశ్, నాయ కులు రాజయ్య, యాదగిరి, సుధాకర్, కృష్ణ, రాజయ్య, రవి, శరత్, స్వామి, భరత్, రామాంజనేయులు పాల్గొన్నారు.
మనోహరాబాద్ మండలం కొనాయిపల్లి(పీటీ)లో హనుమాన్ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాలు ప్రారంభమయ్యాయి. మొదటిరోజు ధ్వజస్తంభం, హనుమాన్, శివలింగం ఇతర విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేశారు. మూడు రోజుల పాటు కొనసాగే ప్రతిష్ఠాపనోత్సవాలకు ప్రజలు హాజరుకావాలని సర్పంచ్ ప్రభావతీనర్సయ్యముదిరాజ్ కోరారు. ఉత్సవాల్లో బీఆర్ఎస్ నేత చంద్రశేఖర్ ముదిరాజ్ ఉన్నారు.
చేగుంట మండలకేంద్రంలో మహంకాళి దేవాలయ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మొదటిరోజు గణపతి పూజ, గోపూజ, అమ్మవారి విగ్రహాల ఊరేగింపు నిర్వహించారు. విగ్రహ దాత సండ్రుగు ఆగం కుటుంబ సభ్యులు హనుమాన్ దేవాలయం నుంచి మహంకాళి దేవాలయం వరకు విగ్రహాలను ఊరేగించారు. ఊరేగింపులో చేగుంట పట్టణంతోపాటు వివిధ గ్రామాలకు చెందిన భక్తులు పాల్గొన్నారు.
చేగుంటలోని మహంకాళి దేవాలయంలో నిర్వహిస్తున్న విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాలకు హాజరుకావాలని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డిని దుబ్బాకలో ఆలయ కమిటీ సభ్యులు కలి సి ఆహ్వానపత్రం అందజేశారు. మెదక్ రోడ్డులోని నూతనంగా నిర్మించిన మహంకాళి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపనోత్స వాలు ఐదురోజుల పాటు నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు సండ్రుగు సతీశ్, హరీశ్, రాజు, శ్రీకాంత్, వెంకటేశ్, వంశీ, బాలేశ్, గణేశ్, సందీప్, శివకోటి, బంటి, విష్ణు, కిరణ్, శ్రీమాన్, సుజిత్, శరత్ పాల్గొన్నారు.