అందోల్, సెప్టెంబర్ 23: తెలంగాణ ప్రభు త్వం చేపడుతున్న అభివృద్ధి పనులు, సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్శితులై కాంగ్రెస్, బీజేపీల నుంచి నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతున్నారని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. శనివారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో టేక్మాల్ మండ లం వెల్పుగొండ, బొల్లికుంట తండాకు చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు, బీజేపీ టేక్మాల్ మండల ఎస్టీ సెల్ అధ్యక్షుడు రవి, ఇతర కాంగ్రెస్, బీజేపీ నాయకులు బీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే కండువా లు కప్పి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కలిసి కట్టుగా పనిచేయాలన్నారు. నియోజకవర్గంలోని ప్రజల సమస్యలు తెలుసుకుంటూ, వాటిని పరిష్క రిస్తున్నామన్నారు. నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి పనులు ప్రజలకు వివరిస్తూ, బీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతంపై దృష్టి పెట్టాలని సూచించారు. బొల్లికుంట తండావాసులు క్రాంతికిరణ్కే తమ మద్దుతు అని ఏకగ్రీవ తీర్మానం చేశారు. కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు భక్తుల వీరప్ప, ప్రధాన కార్యదర్శి అవినాశ్ పాల్గొన్నారు.