నిజాంపేట,నవంబర్29 : సీఎం కేసీఆర్ సారధ్యంలో నడుస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. సోమవారం మెదక్ జిల్లా నిజాంపేట మండలం రజాక్పల్లి గ్రామంలో శివపంచాయతన నవగ్రహ నాగేంద్ర సమేత హనుమాన్ విగ్రహ ప్రతిష్ట, బొడ్రాయి ప్రతిష్ట, వెంకటాపూర్ (కె) తండాలో ఎమ్మెల్సీ షేరి సుభాష్రెడ్డితో కలిసి సేవలాల్ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు.
తెలంగాణ రైతులు దేశ రైతాంగానికి ఆదర్శమన్నారు. ఇలాంటి సమయంలో ధాన్యం సేకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరిని ప్రదర్శిస్తూ రైతులను ఆగం చేస్తుందన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.